News

హైదరాబాదులో దుర్గామాత విగ్రహం తొలగింపు

355views

మూసాపేటలో దుర్గామాత ఆలయంలో విగ్రహం తొలగింపు ఘటన కలకలం సృష్టించింది. దుండగులు దుర్గామాత విగ్రహాన్ని ఆలయం బయట వదిలి వెళ్లారు. ఆలయ సమీపంలోని జంట నాగుపాముల విగ్రహాన్ని ధ్వంసం చేశారు. సమాచారమందుకున్న స్థానిక భాజపా కార్పొరేటర్‌ మహేందర్‌ కార్యకర్తలతో కలిసి ఘటనాస్థలికి చేరుకున్నారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.