
554views
అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ భూమి పూజ చేస్తున్న నేపథ్యంలో భద్రాచలం రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానాచార్యుడు స్థలసాయి, ప్రధాన అర్చకుడు సీతారామానుజాచార్యులు నేతృత్వంలో బేడా మండపంలో సీతారామచంద్రుల వారిని ఆరాధించి అర్చన చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హోమగుండంలో నెయ్యి, సమిధలు సమర్పించి హోమం చేశారు. అయోధ్య రామమందిర నిర్మాణ పనులు విజయవంతంగా పూర్తి కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు





