పరమ పురుష పూర్ణ థాని స్వామీజీ మహరాజ్ స్మారక చిహ్నం
ఆగ్రా అంటే తాజ్ మహల్ మాత్రమే గుర్తుకు వచ్చేలా చేశారు. అది గొప్ప కట్టడమే. భారతీయ శ్రామికుల కష్టమే. కానీ ఇప్పుడు ఆగ్రాకు సమీపంలో, తాజ్మహలు 12 కిలోమీటర్ల దూరంలో మరొక అద్భుతమైన పాలరాతి కట్టడం తయారైంది. ఇది రాధాస్వామి ఆరాధనా విధాన మూల పురుషుడు పరమ పురుష పూర్ణ థాని స్వామీజీ మహరాజ్ స్మారక చిహ్నం. తాజ్ మహల్ కట్టడానికి 22 సంవత్సరాలు పట్టిందని చరిత్ర చెబుతుంది. రాధాస్వామి స్మారక మందిరం కట్టడానికి వందేళ్లు పట్టింది. తాజ్ వలెనే ఇది కూడా పూర్తిగా రాజస్తాన్ నుంచి తెచ్చిన తెల్ల పాలరాతితోనే నిర్మించారు. ఆగ్రాలోనే దయాల్బాగ్ అనే చోట స్వామి బాగ్లో ఇది కట్టారు. ఇక్కడ ప్రవేశం ఉచితం, కానీ ఫోటోలు తీయడం నిషిద్ధం. ఇదే స్థలంలో మొదట తెల్ల పాలరాతితోనే పూర్ణథాని మహరాజ్ స్మారక చిహ్నం...





