News

News

అనంతపురంలో ఎన్‌ఐఏ సోదాలు.. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సోహెల్‌ అరెస్ట్‌

అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎన్‌ఐఏ దాడులు నిర్వహించింది. పట్టణంలోని ఆత్మకూర్‌ వీధికి చెందిన రిటైర్డ్‌ హెడ్‌మాస్టర్‌ అబ్దుల్‌ ఇంట్లో అధికారులు సోదాలు చేశారు. ఆయన కుమారుడు సోహెల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడు బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. సోహెల్‌ ఎస్‌బీఐ...
News

బ్రహ్మోత్సవాల్లో హనుమంత వాహనంపై దర్శనమిచ్చిన గోవిందరాజస్వామి

తిరుపతి గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం గోవిందరాజస్వామి హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ మాడ వీధుల్లో నిర్వహించిన ఊరేగింపు భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా జరిగింది. బుద్ధి, బలము, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, ఆరోగ్యం, అజాడ్యం, వక్తృత్వం హనుమంతుని స్మరిస్తే లభిస్తాయని, శరణాగతికి ప్రతీకగా స్వామివారు హనుమంత వాహనం పై ఊరేగారని అర్చకులు తెలిపారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనాన్ని నిర్వహించి పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. వాహన సేవలో తిరుమల పెద్దజీయర్‌ స్వామి, చిన్నజీయర్‌స్వామి, ఆగమ సలహాదారులు సీతారామాచార్యులు, మోహన రంగాచార్యులు, ఆల‌య డిప్యూటీ ఈవో శాంతి సూపరింటెండెంట్ నారాయణ, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు....
News

ఆర్.ఎస్.ఎస్.‌లో ఉన్నాను, మళ్లీ అక్కడికి వెళ్తాను: హైకోర్టు జడ్జీ

‘‘ నేను చాలా సంవత్సరాలు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో ఉన్నాను, మళ్లీ అవకాశం వచ్చి అక్కడి చేయదగిన పని ఏదైనా ఉందని ఎవరైన నా దగ్గరకి వస్తే నా శక్తి మేరకు ప్రయత్నిస్తాను’’ కలకత్త హైకోర్టులో రిటైరయిన జస్టిస్ చిత్తరంజన్ దాస్ చెప్పిన మాటలు ఇవి. తన వృత్తిరీత్యా దాదాపు 37 సంవత్సరాలు ఆర్.ఎస్.ఎస్.కు దూరంగా ఉన్నానని చెప్పారు. ఆయనకు న్యాయమూర్తిగా సోమవారం చివరి పనిదినం కావడంతో బార్ సభ్యుల సమక్షంలో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆర్‌.ఎస్‌.ఎస్‌.లో ధైర్యంగా, నిటారుగా ఉండటం నేర్చుకున్నా' " కొంతమంది వ్యక్తులు ఆర్.ఎస్.ఎస్. అంటేనే అసహ్యంతో చూస్తున్నారు. వారికి నా గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా అక్కడి నుంచే వచ్చాను" అని ఆయన అన్నారు. 14 సంవత్సరాలకు పైగా హైకోర్టు న్యాయమూర్తిగా...
News

ఎట్టి పరిస్థితుల్లోనూ భారత భద్రతకు ముప్పును అనుమతించబోం: శ్రీలంక

భారత భద్రతకు ముప్పు తలపెట్టే చర్యలను తాము అనుమతించబోమని శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ అన్నారు. పొరుగు దేశంగా అది తమ బాధ్యత అని స్పష్టం చేశారు. భారత భద్రత ప్రయోజనాలను పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. చైనాకు చెందిన...
News

తిరుపతి గంగమ్మ జాతర

తిరుపతి గంగమ్మ ఆలయం భక్తులతో పోటెత్తింది. మంగళవారం గంగ జాతర కావడంతో పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుంటున్నారు భక్తులు. ఆలయ ఆవరణలో పొంగళ్ళు పెడుతూ అమ్మవారిని సేవిస్తున్నారు భక్తులు. వివిధ రకాల వేషధారణతో గంగమ్మకు మొక్కులు సమర్పించుకుంటున్నారు భక్తులు. అలాగే సున్నపుకుండలు...
ArticlesNews

శివాజీ నిర్భీతి

భయం ఒక అదృశ్యశక్తి. అది చాలా రకాలుగా బయటపడుతూఉంటుంది.అందుకనే పతంజలి మహర్షి‘‘నిర్భయత్వం సన్యాసి లేదా సాధకుడి ముఖ్యలక్షణం’’అన్నాడు. శివాజీలో ఆ నిర్భయత్వం కనబడుతుంది. రాజాజయ సింగ్‌ను కలవడానికి వెళ్ళినప్పుడు ఒప్పందం ప్రకారం శివాజీ నిరాయుధుడై, కేవలం ఆరుగురు బ్రాహ్మణులను వెంటబెట్టుకుని వెళ్ళాడు....
News

బాలికతో వేంకటరమణుడి నిశ్చితార్థం

రాయదుర్గంలో ప్రతి ఏటా బాలికతో ప్రసన్న వేంకటరమణుడి కల్యాణోత్సవాన్ని జరపటం అరవా తెగకు ఆనవాయితీగా వస్తోంది. పట్టణంలో నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్థానిక మార్కండేయ స్వామి ఆలయంలో పురప్రముఖులు, దేవాదాయశాఖ అధికారులు, భక్తుల ఆధ్వర్యంలో సోమవారం రాత్రి పట్టణానికి చెందిన రమేష్, జయమ్మల కుమార్తె మౌనిక(10)తో శ్రీవారి నిశ్చితార్థం చేశారు. ఈనెల 25న ఉదయం 11గంటలకు పట్టణంలోని స్వామివారి ఆలయంలో ప్రజల సమక్షంలో శ్రీదేవి, భూదేవిలతో పాటు బాలికతోనూ వేంకటేశ్వరుడి ఉత్సవ విగ్రహంతో కల్యాణం చేయనున్నారు. స్వామివారి తరఫున ఆలయ కమిటీ అధ్యక్షుడు పాలాక్షిరెడ్డి, దేవాదాయశాఖ కార్యనిర్వహణాధికారి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు మేళతాళాలతో ఊరేగింపుగా కుమార్తె ఇంటికి చేరుకున్నారు. అప్పటికే అలంకరించిన మౌనికను తల్లిదండ్రులు, బంధువులతో ఊరేగింపుగా మార్కండేయస్వామి ఆలయానికి తీసుకువచ్చి, అర్చకులు బాలికతో వేంకటరమణుడి(కలశం)తో నిశ్చితార్థం చేశారు. నిశ్చితార్థం అనంతరం స్వామివారి...
News

శ్రీలంక ఆలయంలో సరయు నదీ జలాలతో కుంభాభిషేకం…తిరుపతి నుంచి ప్రసాదం

శ్రీలంకలోని సీతా అమ్మన్ ఆలయానికి ఆదివారం నిర్వహించిన కుంభాభిషేకం కార్యక్రమంలో శ్రీలంక, భారత్, నేపాల్ కు చెందిన వేల మంది భక్తులు పాల్గొన్నట్లు భారత హైకమిషన్ 'ఎక్స్' వేదికగా తెలి పింది. సీతా ఎలియా అనే గ్రామంలో జరిగిన ఈ వేడుకలో అయోధ్య నుంచి ప్రవహించే పవిత్రమైన సరయు నది జలాలను ఉపయోగించారు. ఈ కార్యక్రమానికి శ్రీలంకలో భారత హైకమిషనర్ సంతోష్ ఝా, ఆధ్మా త్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ హాజరయ్యారు. భారత్, నేపాల్ దేశాలు అందించిన వస్త్రాలతో పాటు, తిరుపతి నుంచి పంపించిన ప్రసాదాలను సీతా దేవికి సమర్పించడంతో ఈ కార్యక్రమం ముగిసింది....
News

నలుగురు ఐసిస్ అనుమానిత ఉగ్రవాదుల అరెస్టు…..భారత్ లో విధ్వంసానికి పన్నాగం

గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్ర యంలో శ్రీలంకకు చెందిన నలుగురు ఐసిస్ అనుమానిత ఉగ్రవాదులను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు అదుపులోకి తీసుకు న్నారు. కొలంబో నుంచి చెన్నై మీదుగా ఆదివారం...
News

శ్రీవారి వీఐపీ బ్రేక్ టికెట్ల జారీ పునఃప్రారంభం…సిఫార్సు లేఖలు స్వీకరిస్తున్న టీటీడీ

ఎన్నికల కోడ్ అమలుతో గత నెల నుంచి ఆగి పోయిన వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల సిఫార్సు లేఖలను సోమవారం నుంచి అనుమతిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో తిరిగి వీఐపీమల సిఫారుసుపై బ్రేక్ టికెట్ల జారీకి అనుమతించాలన్న టీటీడీ విజ్ఞప్తికి...
1 1,210 1,211 1,212 1,213 1,214 2,480
Page 1212 of 2480