ఆలయం కూల్చివేత ఘటనలో ఇద్దరు అరెస్ట్
అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలం కనుగొండ అటవీ ప్రాంతంలోని అభయాంజనేయస్వామి ఆలయం కూల్చివేత ఘటనలో నిందితులకు పేలుడు పదార్థాలు సరఫరా చేసిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ దర్బార్ కొండయ్యనాయుడు తెలిపారు. డీఎస్పీ కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ములకలచెరువులోని కనుగొండ అటవీ ప్రాంతంలో ఈ నెల 14న అభయాంజనేయస్వామి ఆలయాన్ని కొందరు కూల్చేశారు. ఆలయ పూజారి విద్యాసాగర్ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు. అదే ప్రాంతానికి చెందిన కనుగొండస్వామి ఆలయ పూజారి హరినాథ్యాదవ్ ఈ ఘటనకు పాల్పడినట్లు గుర్తించారు. కనుగొండస్వామి ఆలయానికి భక్తులు రాకపోవడంతో కక్ష పెంచుకున్నాడన్నారు. దీంతో పాటు ప్రభుత్వం ఆలయాల్లో దూపదీప నైవేద్యాలకు అందించే రూ.10వేలు తన ఆలయానికి రాకుండా పోతుందని భావించాడు. అభయాంజనేయస్వామి ఆలయం లేకుంటే తన ఆలయానికి భక్తులు ఎక్కువగా రావడంతో పాటు ప్రభుత్వం నుంచి డబ్బు...







