పాకిస్థాన్లో వ్యాపారం.. పైసా కూడా తిరిగిరాదు.. ఇది మాత్రం పక్కా..
స్వాతంత్ర్యం వచ్చిన కొత్తల్లో ఆర్థికంగా పాకిస్థాన్ చాలా మెరుగ్గా ఉండేది. అదే సమయంలో కొరియా యుద్ధం కూడా ప్రారంభం కావడంతో అమెరికా అవసరాల రీత్యా పాక్, తుర్కియేల్లో పశ్చిమ దేశాల కంపెనీలను ఏర్పాటు చేలా ప్రోత్సహించింది. కానీ, కాలం గడిచే కొద్దీ పరిస్థితి మారుతూ వచ్చింది. సైన్యం పెత్తనం పెరగడం, బోర్డుల్లోకి పాక్ ప్రభుత్వ మనుషులు చేరడం వంటివి పెరిగిపోయాయి. ప్రస్తుతం అక్కడున్న ఎంఎన్సీలు (బహుళజాతి సంస్థలు) పెట్టేబేడా సర్దుకొని...









