
980views
కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న నేపథ్యంలో భారత్, అమెరికాలో నెలకొన్న పరిస్థితులను వివరించారు న్యూయార్క్ సిటీకి చెందిన ఓ మహిళ. అగ్రరాజ్యంలో ఆధునిక జీవన విధానం, భారత్లో పరిస్థితికి ఉన్న తేడాను పోల్చి చెప్పారు. కరోనా వైరస్ నియంత్రణ విషయంలో రెండు దేశాల మధ్య వ్యత్యాసాన్ని వివరించారు. అగ్రరాజ్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఎలాంటి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది… భారత్ ముందుగానే మేల్కొనడం వల్ల కరోనాను ఎలా కట్టడి చేయగలుగుతోంది అనే అంశాలను వివరిస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది.





