వికసిత్ భారత్కు దిశ, దశ చూపేది సంస్కృతమేనని కేంద్ర నాయ్యశాఖ మంత్రి అర్జున్ మేఘవాలే తెలిపారు. ఎన్ఎస్యూలో రెండు రోజుల పాటు నిర్వహించిన ఉత్కర్ష మహోత్సవం–2026 కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. కేంద్రమంత్రి మాట్లాడుతూ సంస్కృతంలోని జ్ఞానం అర్థం చేసుకుని, సామాజిక విలువలను కాపాడాలని కోరారు. ప్రపంచంలోని శ్లోకాలు, హితవాక్యాలు రచించడం సంస్కృత గౌరవాన్ని తెలియజేస్తుందని చెప్పారు. సంస్కృతంలోని శాస్త్రాలు, ఇతర ఆధునిక విషయాలతో పరిశోధనలు ముమ్మరం చేస్తే మరింత ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని సూచించారు. అనంతరం విశ్వవిద్యాలయంలో మహా పరీక్షలో ఉత్తీర్ణత సాధించినటువంటి అద్వైత వేదాంత విద్యార్థి వరదరాజన్కు వేదాంత విధ్వన్మణి పురస్కారం ప్రదానం చేశారు. చక్కటి విద్వాంసుడిని తయారు చేసిన అద్వైత వేదాంత విభాగ ఆచార్యులు డాక్టర్ శ్రీహరి శివరాం దాయగుడేను శాస్త్ర విధ్వన్మణి బిరుదుతో సత్కరించారు. అలాగే అవధాని కేవీఎస్ఎస్, ఎస్వీయూ రిటైర్డ్ ప్రొఫెసర్ ప్రతాప్ను అవార్డులతో సత్కరించారు. అనంతరం వర్సిటీ ప్రచురించిన 25 పుస్తకాలను ఆవిష్కరించారు. ఎన్ఎస్యూ వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి, లాల్ బహదూర్శాస్త్రి సంస్కృత వర్సిటీ వీసీ మురళీ మనోహర్ పాఠక్, రిజిస్ట్రార్ వెంకటనారాయణరావు, డీన్ రజనీకాంత్ శుక్లా, కో–ఆర్డినేటర్ గణపతిభట్, ఆచార్యులు సత్యనారాయణ, శ్రీవాత్సవ, దక్షణమూర్తి శర్మ పాల్గొన్నారు
6views
You Might Also Like
విశిష్టతల సమ్మిళితం శ్రావణ పున్నమి
మన సంస్కృతీ సంప్రదాయాల వారసత్వ గని శ్రావణ పౌర్ణమి. మధుకైటభులు అనే దానవుల నుంచి వేదాలను రక్షించేందుకు యజ్ఞగుండం నుంచి ‘వాగీశ్వరుడు’ (హయగ్రీవుడు) ప్రభవించిన తిథి. వేదాధ్యాయనం...
11 ఆగస్ట్ 1947: దేశ విభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?
1 ఆగస్ట్ 1947 : దేశ విభజనకు 15 రోజుల ముందు ఏం జరిగింది? 2 ఆగస్ట్ 1947: దేశ విభజనకు 15 రోజుల ముందు ఏం...
వందేమాతరం అంటే హిందూ దేవతల పూజ కాదు: బాబా రాందేవ్
7
‘వందేమాతరం’ గీతం పూర్తి రూపంలో ఆలపించడంపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో, యోగా గురు బాబా రాందేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ గీతంలోని సాహిత్యం హిందూ దేవతలైన...
ముంబైలో గణేశుడి శోభాయాత్రలో గుడ్లు విసిరిన చంధాసులు
9
ముంబైలో గణేశుడి ఆగమన శోభాయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మజ్గావ్ ప్రాంతంలో వినాయక విగ్రహాన్ని మండపానికి తీసుకువస్తున్న సమయంలో శోభాయాత్రపై ఓ భవనం నుంచి గుడ్లు విసిరినట్లు ఆరోపణలు...
రాజస్థాన్లో విదేశీ నిధుల వ్యవహారం.. పాస్టర్ నివాసంపై ఈడీ సోదాలు
8
జైపూర్: రాజస్థాన్లో విదేశీ నిధుల దుర్వినియోగానికి సంబంధించిన వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఆగస్టు 21న ఈడీ జైపూర్ ప్రాంతీయ కార్యాలయ అధికారులు...
బంగ్లాదేశ్లో ఒకే హిందూ కుటుంబానికి చెందిన నలుగురు దారుణ హత్య?
8
బంగ్లాదేశ్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. రంగ్పూర్ నగరంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు తమ స్వగృహంలోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా దిగ్భ్రాంతికి...





