
525views
మహమ్మారి కరోనా విషయంలో యువత అతీతం కాదని, నిర్లక్ష్య ధోరణి తగదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హితవు పలికింది. కరోనా బారిన పడుతున్న వారు, ప్రాణాలు కోల్పోతున్నవారిలో వయసుపైబడిన వారే అధికంగా ఉన్నప్పటికీ యువత తక్కువ అంచనా వేసి ప్రాణాల మీదకు తెచ్చకోవద్దని డబ్ల్యూహెచ్ఓ డైరక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ హెచ్చరించారు. ముందు జాగ్రత్తలు తీసుకోకుండా.. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వేలాది యువకుల పరిస్థితి మరిచిపోవద్దని చెప్పారు. కోవిడ్-19 ను ఎదుర్కోవాంటే.. రెండు జనరేషన్లవారు సంఘీభావంతో పనిచేయాలని, అప్పుడే వైరస్ను దీటుగా ఎదుర్కోవచ్చని శుక్రవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన వెల్లడిచారు.





