News

హరిద్వార్ లో సంస్కార భారతి వర్గ

25views

హరిద్వార్ : సంస్కార భారతి ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ప్రాంత స్థాయి వర్గ నిష్కామ సేవా ట్రస్ట్ లో జరిగింది. ఈ మూడు రోజుల శిక్షణా కార్యక్రమంలో ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ మరియు బ్రజ్ ప్రాంతాలకు చెందిన 75 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ఇందులో సంస్థాగత విస్తరణ, కార్యకర్తల నైపుణ్యాభివృద్ధిపై చర్చించారు. సమారోప్ కార్యక్రమంలో ప్రాంత ప్రచారక్ డాక్టర్ శైలేంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజం మనవైపు ఆసక్తితో చూస్తోందని, అడుగులు వేయడమే తఱువాయి అని అన్నారు.

క్షేత్ర ప్రచార ప్రముఖ్ పదం మాట్లాడుతూ, సంస్కార భారతి లక్ష్యం వాస్తవానికి సనాతన ధర్మ లక్ష్యమేనని పేర్కొన్నారు; హిందూ విశ్వాసాన్ని పరిరక్షించడంలో ‘సంస్కారాల’ (సాంస్కృతిక విలువలు) ప్రాముఖ్యతను అనాదిగా దేవతలు నొక్కిచెప్పారు. భారతదేశానికి చెందిన లలిత కళలు మరియు కళారూపాలను ప్రోత్సహించడం, ప్రచారం చేయడమే సంస్కార భారతి యొక్క ప్రధాన లక్ష్యం. అని వివరించారు.

కార్యక్రమ ముగింపులో, సంస్కార భారతి ప్రాంతీయ వ్యవస్థాపక కార్యదర్శి విజయ్ కుమార్ మాట్లాడుతూ, సంస్థ కొత్త శిఖరాలను అధిరోహిస్తోందని, అయితే ఇంకా కృషి అవసరమని పేర్కొన్నారు. వ్యక్తిగత దృక్పథం, అంకితభావం కలిగిన కార్యకర్త యొక్క మనస్తత్వం మరియు చేసే పని – వీటి మధ్య సమన్వయం ఉండాలని ఆయన నొక్కి చెప్పారు