News

జెనీవాలో భారత స్వరం వినిపించిన భారతీయ మజ్దూర్ సంఘ్!

6views

స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరిగిన 114వ అంతర్జాతీయ కార్మిక సదస్సు లో భారతీయ మజ్దూర్ సంఘ్ సంఘటన కార్యదర్శి శ్రీ బి. సురేంద్రన్ గారు ప్రపంచ కార్మికుల భవిష్యత్తు, కృత్రిమ మేధస్సు (AI), సామాజిక భద్రత మరియు సమ్మిళిత అభివృద్ధి అంశాలపై కీలక ప్రసంగం చేశారు.

“ఆవిష్కరణలు మానవాళికి సేవ చేయాలి. సాంకేతికత మానవులను భర్తీ చేయడానికి కాదు, వారికి సహకరించడానికి ఉండాలి” అని ఆయన స్పష్టం చేశారు.

ప్రపంచంలోనే అత్యధిక సామాజిక భద్రతా కవరేజీ కల్పిస్తున్న దేశంగా భారతదేశం నిలవడం గర్వకారణమని, ప్రస్తుతం 64% మంది కార్మికులు సామాజిక భద్రతా పథకాల పరిధిలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

గిగ్ వర్కర్లు, ప్లాట్‌ఫామ్ వర్కర్లు, వలస కార్మికుల హక్కులు, భద్రత మరియు గౌరవప్రదమైన ఉపాధి కోసం ప్రపంచ దేశాలు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.

సాంకేతిక పరివర్తన, ఆర్థిక సవాళ్లు, ప్రపంచ సంఘర్షణల మధ్య కూడా “అందరికీ అభివృద్ధి – అందరికీ గౌరవప్రదమైన ఉపాధి” అనే లక్ష్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.