
జార్ఖండ్లోని గర్వాలో రామ నవమి ఊరేగింపు సందర్భంగా ఇస్లామిస్టులు రాళ్లు రువ్వడం అర్ధరాత్రి హింసాత్మక ఘటనలకు జరిగాయి. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి బాష్పవాయువు ప్రయోగించి, లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆ ప్రాంతమంతటినీ సెన్సిటివ్ జోన్ గా ప్రకటించారు.
రామ నవమి సందర్భంగా మహా అష్టమి రోజున, ఊరేగింపు మార్గంపై తలెత్తిన వివాదం హింసాత్మకంగా మారడంతో గర్వా జిల్లాలోని రామ్కంద పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తతలు పెరిగాయి. బుధవారం రాత్రి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
మార్చి 26న నిరసనలు జరిగినప్పటికీ, రామ నవమి ఊరేగింపును పోలీసుల రక్షణలో నిర్వహించారు. అయితే, సాయంత్రం అది కౌవాఖోఖ్ శివ్ చబుత్రా సమీపానికి చేరుకోగానే, ఇస్లామిస్టులు దాని మార్గాన్ని అడ్డుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఒక చిన్న వాగ్వాదంగా మొదలైనది త్వరగా ఇరుపక్షాల మధ్య రాళ్ల దాడికి దారితీసింది.
పరిస్థితి అదుపు తప్పడంతో, డిఐజి కౌశల్ కిషోర్ , ఎస్పి అమన్ కుమార్ భారీ పోలీసు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గుంపును చెదరగొట్టడానికి పోలీసులు స్వల్ప బలప్రయోగం చేసి, బాష్పవాయువు ప్రయోగించి, లాఠీచార్జి చేశారు.
ఈ ఘర్షణల్లో సుమారు అరడజను మంది పోలీసు సిబ్బందితో సహా పలువురు గాయపడ్డారు. గాయపడిన పౌరులలో మిథిలేష్ కుమార్, అనిల్ కుమార్, సచిన్ కుమార్ ఉన్నారు, వీరు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
పోలీసులు డజనుకు పైగా అనుమానితులను అదుపులోకి తీసుకుని, పలు మోటార్సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తూ, రామ్కంద ఎస్హెచ్ఓ సురేంద్ర సింగ్ కుంతియాను ఆయన పదవి నుంచి తొలగించి, ఆర్కే పటేల్కు బాధ్యతలు అప్పగించారు. రాళ్ల దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టబోమని డీఐజీ గట్టిగా స్పష్టం చేశారు.





