
డెహ్రాడూన్లోని పరేడ్ గ్రౌండ్లో జరిగిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 71వ జాతీయ సమావేశానికి ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి హాజరయ్యారు. ఈ సందర్భంగా, గోరఖ్పూర్కు చెందిన శ్రీకృష్ణ పాండేను ప్రొఫెసర్ యశ్వంత్ రావు కేల్కర్ యువజన అవార్డుతో సత్కరించారు. బాలల భిక్షాటనను నిర్మూలించడం, మానసిక రోగులు మరియు నిస్సహాయులకు సేవ చేయడం జైలు ఖైదీలకు పునరావాసం కల్పించడం ద్వారా శ్రీ పాండే సామాజిక బాధ్యతకు గొప్ప ఉదాహరణగా నిలిచారని వారు పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) కార్యాలయ సిబ్బందిని ముఖ్యమంత్రి స్వాగతించారు. తాను గతంలో ABVP సభ్యుడిగా విద్యార్థులలో చురుకుగా పనిచేశానని ముఖ్యమంత్రి అన్నారు. ఆ అనుభవాలు తనకు నాయకత్వం , సంస్థాగత అవగాహనను ఇవ్వడమే కాకుండా, సామాజిక సేవ పట్ల తన నిబద్ధతను కూడా బలోపేతం చేశాయని, క్రమశిక్షణతో సేవా మార్గంలో ప్రతిరోజూ ముందుకు సాగడానికి స్పూర్తినిచ్చాయని పేర్కొన్నారు… ABVP నిర్వహిస్తోన్న ఈ జాతీయ సమావేశం సాధారణ కార్యక్రమం కాదని, దేశ నిర్మాణ పవిత్ర యజ్ఞానికి అంకితమైన శక్తివంతమైన యువతకు చెందిన గొప్ప సమావేశం అని ముఖ్యమంత్రి అన్నారు.
ఈ వేదిక నుండి వెలువడే ఆలోచనలు, తీర్మానాలు జాతి నిర్మాణంలో ఒక మైలురాయిగా నిలుస్తాయని చెబుతూ దేశ అభివృద్ధి మరియు సామాజిక పురోగతికి కొత్త దిశను అందించడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని ముఖ్యమంత్రి ధామి ఆశాభావం వ్యక్తం చేశారు. దేశం కొత్త యుగం వైపు పయనిస్తోన్న 1949లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏర్పడిందని ఆయన అన్నారు. ఇప్పుడున్నటువంటి సమయంలో, జాతి నిర్మాణం, సామాజిక సంస్కరణ , సాంస్కృతిక మేల్కొలుపు కోసం ఒక వ్యవస్థీకృత, అవగాహన, సంస్కారవంతమైన . జాతీయవాద విద్యార్థి శక్తి అవసరం ఉంది. ఈ సంస్థ 77 సంవత్సరాలుగా వ్యక్తిగత అభివృద్ధి ద్వారా జాతి నిర్మాణం కోసం కృషి చేస్తోంది. దేశంలోని సామాజిక, సాంస్కృతిక, విద్యా సైద్ధాంతిక రంగాలలో విస్తృత మార్పును తీసుకురావడంలో విద్యార్థి పరిషత్ ఒక ప్రముఖ శక్తిగా ఉద్భవించింది అని వారన్నారు.
భారతదేశ యువశక్తి మన దేశానికి గొప్ప ఆస్తి అని, వారి కృషి, ప్రతిభ మరియు సంకల్పం ద్వారా బలమైన, సంపన్నమైన మరియు స్వావలంబన భారతదేశం యొక్క కలను సాకారం చేసుకోగలదని ముఖ్యమంత్రి ధామి అన్నారు. ఈ శక్తిని సరైన దిశలో మరియు మార్గదర్శకత్వంలో నడిపించడం ద్వారా దేశాన్ని ప్రపంచ నాయకుడిగా తిరిగి స్థాపించవచ్చు. ఈ శక్తిని సరైన దిశలో ఉపయోగించుకోవడం ద్వారా మాత్రమే మనం ఐక్యమైన, ఉన్నతమైన భారతదేశం యొక్క కలను సాకారం చేసుకోగలమని ఆయన అన్నారు. నేడు, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఫిట్ ఇండియా మరియు కొత్త విద్యా విధానం వంటి అనేక పథకాల ద్వారా, యువతకు వారి ప్రతిభ మరియు సామర్థ్యానికి అనుగుణంగా అవకాశాలు కల్పించబడుతున్నాయని ఆయన అన్నారు.





