
మహాభారతంలో శ్రీకృష్ణుడు, అర్జునుడికి ఉపదేశించిన భగవద్గీత సారాంశం సకల మానవాళికీ దిక్సూచి అని అన్నవరం దేవస్థానం ఈవో వీర్ల సుబ్బారావు పేర్కొన్నారు. దేవస్థానంలో శ్రీ మద్భగవద్గీత జయంతి వేడుకలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. డిసెంబరు 1 వరకు రోజుకొక పాఠశాల విద్యార్థులకు భగవద్గీత పారాయణ,ధ్యానం, సజ్జనసాంగత్యం నిర్వహిస్తామని.. ఉదయం 9గం టల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయని ఈవో తెలిపారు. గీతాజయంతి రోజున అన్నమయ్య 12వ తరం వారసులు తిరుమల శ్రీవారి ఆలయ సంకీర్తన కైంకర్యవర్యులు తాళ్లపాక స్వామీ జీ విచ్చేస్తారని చెప్పారు. ఈ వేడుకలను గత 12ఏళ్లగా ఏడాదికి ఒకరోజు పెంచుకుంటూ ప్రతీ ఆలయంలో నిర్వహిస్తున్నట్లు గీతాజయంతి ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. గీతాసారాంశాన్ని చిన్నారుల్లోకి తీసుకెళ్లి సమాజానికి మరింత చేరువ చేయాలనే ఉద్దేశ్యంతో వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు.





