News

తుంగభద్ర తీరంలో మన ఊరు-మన గుడి-మన బాధ్యత కార్యక్రమం

351views

మన ఊరు-మన గుడి-మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా నంద్యాల జిల్లాలోని దేవాలయాలను కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం పేరుతో శుభ్రం చేశారు. ఇందులో భాగంగా ఎన్నో ధార్మిక, సామాజిక సేవా కార్యక్రమాలను శివకుమార్ రెడ్డి వారి బృందం ఉద్యమ స్ఫూర్తితో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వీటిలో కొన్ని

  • పార్కుల ఏర్పాటు.
  • స్వర్గ ధామాలుగా తీర్చి దిద్దిన స్మశాన వాటికలు
  • గ్రీన్ నంద్యాల, బడ్డింగ్ హ్యాండ్స్ పేరుతో పండ్ల మొక్కల పంపినీ, మొక్కలు నాటడం, వన జీవి రామయ్య దంపతులను ఆహ్వానించి సన్మానించటం ప్రజల్లో స్ఫూర్తి నింపటం
  • కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
  • గో సేవ, (డెక్కలు పెరిగి నడవలేని వీధి గోవులను గుర్తించి పశు వైద్యుల సహకారంతో వాటి డెక్కలు సరిచేసి వాటి సమస్య తీర్చటం), రోగాల బారిన పడి ఇబ్బంది పడుతున్న గోమాతల కు వైద్యం అందించడం
  • పురాతన ఆలయాల, కట్టడాల జీర్ణోద్ధరణ.
  • శ్రీశైల క్షేత్రానికి కాలినడకన వచ్చే కర్నాటక, మహారాష్ట్ర భక్తులకు పాదలకు తైల మర్దన సేవ, మెడికల్ క్యాంప్, అన్న దాన సేవ.
  • సాంస్కృతిక కళారూపాల సంబరంలా వేలాది భక్తులు వెంటరాగా నవ నందుల పరిక్రమ.
  • ప్రవచనాకారులు చాగంటి కోటేశ్వర రావు గారిని ఆహ్వానించి వారి సమక్షలో 64,000 మంది భక్తులతో ఓంకార జపము చేయించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో నమోదు చేయించారు.
  • ఇంటాక్ నంద్యాల చాప్టర్ సంస్థ ద్వారా పురాతన ఆలయాలు, చారిత్రక స్థలాల పురావస్తు విశేషాలను సేకరించి వాటిని జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థల్లో నమోదు చేయించి, వాటి గుర్తింపుకు కృషి చేసి, ఆయా ప్రాంతాల పునర్వైభవానికి, పర్యాటక అభివృద్ధికి కృషి చేయడం.
  • అయోధ్య రామ మందిర నిర్మాణానికి ప్రధాన సాక్ష్యంగా మారిన పురావస్తు శాస్త్రజ్ఞుడు కేకే అహమ్మద్ గారిని ఆహ్వానించి వర్క్ షాప్ నిర్వహించటం‌.
  • లాంటి ఎన్నో ధార్మిక సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు.

    ఈ కార్యక్రమాలలో భాగంగా గత ఆదివారం “మన ఊరు మన గుడి మన బాధ్యతకు చెందిన 104 మంది వాలంటీర్స్ బృందం ముఖ్యంగా మంత్రాలయం వద్ద 500 మీటర్ల విస్తీర్ణంలో ఉన్న తుంగభద్ర నది ఘాట్ నుండి చెత్తను, బట్టలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, నదిలో విసిరిన మద్యం సీసాలు, షాంపూ వ్యర్ధాలు మొదలైన వాటిని తొలగించారు. ఈ సందర్బంగా తుంగభద్ర నది ఒడ్డున 5 ట్రాక్టర్ల చెత్తను తొలగించి శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయ ప్రాంగణాన్ని కూడా శుభ్రం చేశారు.