
220views
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష కేంద్రం(ISC) నుంచి నేడు క్షేమంగా భూమిని చేరుకున్నారు.యాక్సియం-4 మిషన్ ప్రయోగం విజయవంతమైంది యాక్సియం-4 (Axiom-4) మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో 18 రోజులు గడిపి మంగళవారం భూమికి తిరిగి చేరుకున్నారు. ఈ మిషన్లో శుక్లాతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు—పెగ్గీ విట్సన్ (అమెరికా), స్లావోస్జ్ ఉజ్నాన్స్కీ-విస్నియెస్కీ (పోలాండ్), టిబోర్ కాపు (హంగరీ)—స్పేస్ఎక్స్ డ్రాగన్ స్పేస్క్రాఫ్ట్లో కాలిఫోర్నియా సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలో మధ్యాహ్నం 3:01 గంటలకు (IST) సురక్షితంగా ల్యాండ్ అయ్యారు. కాగా శుభాంశు శుక్లా క్షేమంగా భూమికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు, సన్నిహితులు సంతోషం వ్యక్తం చేశారు.





