
831views
శబరిమల ఆలయ నిర్వహణకు ప్రత్యేక చట్టం రూపొందించాలని కేరళ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. జనవరి మూడో వారంలోపు ఈ కొత్త చట్టం తీసుకురావాలని కేరళ ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. కేరళలోని ఇతర ఆలయాలకు, శబరిమల ఆలయానికి ఒకే చట్టం తీసుకురావడం, అమలుచేయడం సమంజసం కాదని జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. పండలం రాజ కుటుంబం వేసిన ఓ పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





