పర్యావరణ పరిరక్షణకు లక్ష మట్టి వినాయక ప్రతిమల తయారీకి శ్రీకారం చుట్టామని భారత కిసాన్ సంఘ్ కార్యవర్గ సభ్యుడు జలగం కుమారస్వామి తెలిపారు.విశాఖపట్నం జిల్లా శివాజీపాలెంలోని ప్రకృతి ఆధారిత రైతు సంఘం కార్యాలయంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ విశాఖ వేదికగా మట్టి వినాయక ప్రతిమల తయారీపై పోటీలను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. దీనికి సంబంధించి ఏర్పాటు చేసే ఎగ్జిబిషన్లో ప్రజలంతా పాల్గొవాలన్నారు. మట్టి ప్రతిమల తయారీపై ఆసక్తి ఉన్న వారికి ఇది ఒక వేదికగా నిలుస్తుందన్నారు. దీని ద్వారా వారిలో దాగిన వున్న సృజనాత్మకతను వెలికితీయడమేకాకుండా ప్రకృతిని కాపాడానికి చక్కని మార్గంగా నిలుస్తుందన్నారు. ఈ సమావేశంలో ప్రకృతి ఆధారిత వ్యవసాయదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దాట్ల సుబ్రహ్మణ్యం వర్మ, సంస్థ కార్యదర్శి పాలెం నేచురల్స్ అశోక్, వ్యవసాయ శాస్త్రవేత్త అశోక్కుమార్, జల శక్తి మిషన్ విశ్రాంత అఽధికారి కృష్ణ, రంగచార్యులు పాల్గొన్నారు.
61
You Might Also Like
‘దేవాలయాలను ధార్మిక సంఘాలకు అప్పగించాలి’
హిందూ దేవాలయాలను ధార్మిక సంఘాలకు అప్పగించాలని విశ్వహిందూ పరిషత్ నాయకులు కోరారు. విశ్వహిందూ పరిషత్ అన్ని ధార్మిక వ్యాపార, కుల సంఘాల ఆధ్వర్యంలో నంద్యాలలో భారీ నిరసన...
కాంచీపురంలోని శివపార్వతుల విగ్రహాలపై తెలుగు శాసనం
కాంచీపురంలో ఉన్న ఏకాంబరేశ్వర ఆలయంలోని శివపార్వతుల విగ్రహాలపై తెలుగుశాసనం బయటపడింది. శివపార్వతులు, స్కంధ విగ్రహాల పీఠంపై ఈ శాసనం లిఖించి ఉంది. ఇది 18వ శతాబ్దానికి చెందినదని...
సోమనాథ్ మందిరం దగ్గర అక్రమ మసీదు, దర్గా, శ్మశానం తొలగింపు
7
గుజరాత్లోని గిర్ సోమనాథ్ జిల్లాలో సెప్టెంబర్ 28న ఒక మసీదు, ఒక దర్గా, ఒక శ్మశానాన్ని తొలగించివేసారు. ముందస్తు అనుమతి లేకుండా అటువంటి పనులు చేయకూడదంటూ ఇటీవల...
ఆర్ఎస్ఎస్ సాంఘిక్ను అడ్డుకోడానికి కేరళ పోలీసుల ప్రయత్నం
42
కేరళలోని తిరువనంతపురంలో కల్లిక్కట్ గ్రామ పంచాయతీ స్టేడియంలో ఆదివారం నాడు సాంఘిక్ నిర్వహించుకోడానికి ఆర్ఎస్ఎస్ ఏర్పాట్లు చేసుకుంది. సాంఘిక్ అంటే ఒక మండలం, తాలూకా, జిల్లా లేదా...
దేవుళ్ళను రాజకీయం చేయకండి: లడ్డూ వ్యవహారంలో సుప్రీం వ్యాఖ్య
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం మీద సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనను సవాల్ చేస్తూ,...
ఘర్ వాపసీ : తిరిగి హిందూమతంలోకి 100 మంది
31
ఛత్తీస్ గఢ్ లో హిందూ సమాజానికి బలం చేకూరింది. 22 కుటుంబాలకు చెందిన 100 మంది తిరిగి సనాతన ధర్మాన్ని స్వీకరించారు. ఈ ఘటన ఛత్తీస్ గఢ్...