అర్చకుల సంక్షేమానికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని అర్చక సమాఖ్య నేతలు డిమాండ్ చేశారు. ధూపదీప నైవేద్య పథకం (డీడీఎన్ఎస్), డెత్ గ్రాట్యూటీ కోసం అర్చకులు ఎదురు చూడకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. సోమవారం అనంతపురంలోని మొదటిరోడ్డులో ఉన్న కాశీవిశ్వేశ్వర కోదండరామాలయం వేదికగా జిల్లా అర్చక సమాఖ్య సమావేశం జరిగింది. ఉమ్మడి జిల్లాల అర్చక సమాఖ్య అధ్యక్షుడు వైపీ ఆంజనేయులు ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. డీడీఎన్ఎస్ కింద ఉమ్మడి జిల్లాలోని 898 దేవాలయాల్లో అర్చనలు కొనసాగుతున్నా… పలు కారణాలతో పథకం లబ్ధి అందకుండా పోయిందని తెలిపారు. రెండేళ్ల క్రితం రాష్ట్రవ్యాప్తంగా అదనంగా 475 దేవాలయాలను ధూపదీపనైవేద్యం పథకానికి ఎంపిక చేశారని, అయితే అనేక కారణాలను చూపుతూ ఆర్థిక సహకారం నిలిపి వేయడం బాధాకరమని పేర్కొన్నారు. వెంటనే అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. ఎండోమెంట్ సిబ్బంది కొరతను సాకుగా చూపి ఆలయాలపై పర్యవేక్షణ లేకుండా చేయడాన్ని తప్పుబట్టారు. కార్యక్రమంలో సమాఖ్య ప్రధాన కార్యదర్శి దేవిరెడ్డిపల్లి రాజేష్, మారుతీప్రసాద్, ముచ్చుకోట ప్రసాద్, భక్తరహళ్లి వేణుగోపాలస్వామి, రెండు జిల్లాలకు చెందిన అర్చకులు పాల్గొన్నారు.
46
You Might Also Like
సిరిమాను చెట్టుకు బొట్టు
విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమాను, ఇరుసు చెట్లకు పెదతాడివాడలో వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి బొట్టు పెట్టారు. పెదతాడివాడలోని మజ్జి అప్పారావు కల్లంలో గుర్తించిన...
బంగ్లాలో హిందువులపై హింస.. మహారాష్ట్రలో నిరసన ర్యాలీ
18
బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలను నిరసిస్తూ మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో మెగా ర్యాలీ నిర్వహించారు. దాదాపు 20 వేల మంది ఈ ర్యాలీలో పాల్గొని, హిందువులకు మద్దతుగా...
హిందుత్వపై దాడి: టిటిడిలో హిందూ ముసుగులో క్రైస్తవుల నియామకాలు
లడ్డూ కల్తీ వివాదంతో ప్రపంచ ప్రఖ్యాత తిరుమల తిరుపతి దేవస్థానం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. తిరుమలలో హిందువుల ముసుగులో అన్యమతస్తులు, ముఖ్యంగా క్రైస్తవులు టిటిడిలోని కీలక విభాగాల్లో...
‘మన సంస్కృతి వన సంస్కృతి అని చాటిచెప్పాలి’
21
వనాల సంస్కృతే మన దేశపు సంస్కృతి అని దేశవ్యాప్తంగా ఉన్న వనవాసీ తెగల వారందరూ ప్రపంచానికి చాటిచెప్పాలని అఖిల భారతీయ వనవాసీ కళ్యాణ్ ఆశ్రమ్ జాతీయ అధ్యక్షుడు...
శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ఇక అనుమానాలు అక్కర్లేదు : టీటీడీ
18
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో ఇకపై ఎలాంటి అనుమానాలు వద్దని టీటీడీ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు తెలిపారు. ఇటీవల జరిగిన దోషాలు తొలగిపోవాలని శాంతి...
తిరుమల లడ్డూకు నెయ్యి సరఫరా.. ఏఆర్ ఫుడ్స్కు కేంద్రం నోటీసులు
46
తిరుమల లడ్డూ తయారీకి నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ ఫుడ్స్ కంపెనీకి భారత ఆహార భద్రత ప్రమాణాల విభాగం నోటీసులు జారీ చేసింది. నాలుగు కంపెనీల నుంచి...