లోక కల్యాణార్థం, భక్తజన శ్రేయస్సు, ధర్మప్రచారం నిమిత్తం ప్రతి పౌర్ణమి రోజు నిర్వహించే గిరి ప్రదక్షిణలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారని దుర్గగుడి ఈవో కేఎస్ రామరావు పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ ఆదివారం ఉదయం 5.55 గంటలకు ఘాట్ రోడ్డులోని కామధేను అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమైంది. అక్కడ శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి ప్రచార రథానికి ఈవో రామరావు దంపతులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. అమ్మవారి ఆలయం నుంచి మొదలైన ప్రదక్షిణ కుమ్మరిపాలెం, నాలుగు స్తంభాల సెంటర్, సితారా, కబేళా, పాలప్రాజెక్ట్, కేఎల్రావునగర్, చిట్టినగర్, కొత్తపేట, నెహ్రూ బొమ్మ సెంటర్, బ్రాహ్మణ వీధి, ఘాట్రోడ్డు మీదగా తిరిగి ఆలయానికి చేరుకుంది. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, డప్పు కళాకారులు, కోలాట నృత్యాల మధ్య భక్తజనం ముందుకుసాగారు. పౌర్ణమి రోజున జరిగే గిరి ప్రదక్షిణలో పాల్గొంటే కోరికలు త్వరగా తీరుతాయని నమ్మకమని, అందుకే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని ఆలయ అధికారులు తెలిపారు.
41
You Might Also Like
తిరుమలలో ‘ఎఫ్ఎస్ఎస్ఏఐ’ ల్యాబ్
52
తిరుమలలో 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రాష్ట్ర స్థాయి ఆరోగ్య ప్రయోగశాలను ఏర్పాటు చేసేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) సిద్ధమైంది....
ఇంద్రకీలాద్రిలో శుద్ధి కార్యక్రమం నిర్వహించిన డిప్యూటీ సీఎం
34
గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో అపచారం జరిగినందుకు గాను ఉపముఖ్యమంత్రి ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. దీక్షలో భాగంగా ఇవాళ విజయవాడలోని ఇంద్రకీలాద్రి...
పుణె విమానాశ్రయానికి సంత్ తుకారాం పేరు
43
పుణెలోని లెహగావ్ విమానాశ్రయం పేరు మారనుంది. దీనికి 'జగద్గురు సంత్ తుకారాం మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్' గా పేరు మారుస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది....
సంఘకార్యమే ప్రాణం.. వసుధైక కుటుంబమే ధ్యేయం..
సంఘకార్యాన్ని ఆజీవన పర్యంతం మోసి, డాక్టర్ జీ తత్వరూపంగా నిలిచి, భరతమాత ఋణం తీర్చుకోవటమే ధ్యేయంగా జీవితాన్ని సాగించి పరమాత్మలో ఐక్యమైన మల్లాపురం భీష్మాచారి ప్రతి ఒక్కరికీ...
ఆలయ నిర్వహణ సాధువుల పర్యవేక్షణలో వుండాలి: శ్రీశ్రీ రవిశంకర్
39
తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి క్షమించరాని నేరం అని, హిందువుల హిందువులు తీవ్రంగా మనోవేదనకు గురయ్యారని పేర్కొంటూ మార్కెట్లో లభించే నెయ్యి సంగతేంటని ఆధ్మాత్మిక గురువు,...
చంద్రుడిపై రయ్ రయ్మంటూ.. ఒక చోట నుంచి మరో చోటకు ప్రయాణించవచ్చు..
53
చంద్రుడిపై పరిశోధనలు మరింత వేగం పుంజుకోనున్నాయి. ఇప్పటివరకు చంద్రుడిపై ల్యాండ్ అయిన చోటనే పరిశోధనలకు వీలుండేది. ఇప్పుడు ల్యాండ్ అయిన చోట నుంచి వ్యోమగాములు కొంత దూరం...