రామభక్త హనుమంతుడిని తలచుకుంటూ హనుమాన్ శోభాయాత్రను ఆదివారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో అంగరంగ వైభవంగా నిర్వహించారు. బైపాస్రోడ్డులోని అభయాంజనేయస్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన హనుమాన్ శోభాయాత్ర రవితేజ కల్యాణ మండపం, పాత సినిమా హాలు మీదుగా సత్రం సెంటర్, మెయిన్ బజార్, చావడి, హిల్రోడ్డు, ఎరుకలసానినగర్, సోమశిల రోడ్డు సెంటర్, ఎల్ఆర్పల్లి, ఆర్టీసీ బస్టాండ్ తిరిగి మెయిన్ రోడ్డు మీదుగా మున్సిపల్ బస్టాండ్, దళితకాలనీల మీదుగా రవితేజ కల్యాణ మండపం వద్దకు చేరుకుంది. ఈ శోభాయాత్రలో ప్రత్యేక వాహనాలపై ఏర్పాటు చేసిన హనుమంతుడు, శ్రీరాముడు, సీతారామ, లక్ష్మణ, పట్టాభిషేకం విగ్రహాల అలంకరణలు భక్తులను ఆకట్టుకున్నాయి. సుమారు 4 గంటల పాటు సాగిన ఈ శోభాయాత్రలో మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. డీజే సంగీతానికి యువకులు, మహిళలు, చిన్నారులు చేసిన కోలాటం నృత్యం, పండరీ భజన ఆకట్టుకున్నాయి. డీఎస్పీ ఎన్ కోటారెడ్డి, సీఐ జి వేణు, ఎస్సై ముత్యాలరావుతో పాటు వివిధ పోలీసు స్టేషన్ల ఎస్సైలు, పోలీసులు బందోబస్తు పర్యవేక్షణ చేశారు. శోభాయాత్రను చూసేందుకు పలు సెంటర్ల వద్ద మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఆసక్తిగా చూడడం కనిపించింది. శోభాయాత్ర అనంతరం సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకుడు కంచి పరమేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ చేశారు.
48
You Might Also Like
తిరుమల లడ్డూ వివాదం… అమ్మకాలపై ప్రభావం చూపలేదంటున్న టీటీడీ
కల్తీ ఆరోపణల నేపథ్యంలో తిరుమల లడ్డూ చుట్టూ వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు దీనిపై ఆందోళన వ్యక్తం...
పుణ్య క్షేత్రాల్లోని లడ్డూలకు పరీక్షలు
తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించడంతో.. దేశంలోని పలు ప్రముఖ పుణ్యక్షేత్రాు కొలువు తీరిన పట్టణాల్లో, నగరాల్లో లడ్డూలను కొనుగోలు చేసేందుకు ప్రజలు...
మసీదులు, మదర్సాల మతపెద్దల చర్యలు
మదర్సాలు.. మతపరమైన విద్యాసంస్థలు. మత గ్రంథం ఖురాన్తో పాటు.. సంబంధిత అంశాలను వల్లె వేయిస్తూ.. ఇస్లాంకు విధేయులుగా తీర్చిదిద్దడేమే మదర్సాల పని. అందుకే చిన్నప్పుడే మదర్సాల్లో చేర్పిస్తే.....
11 చోట్ల ఎన్ఐఏ దాడులు
22
భారతదేశంలో ఇస్లామిక్ పాలనకు కుట్ర పన్నుతున్న హిజ్బ్ ఉత్-తహ్రీర్ అనే ఛాందసవాద సంస్థపై NIA చర్యలు తీసుకుంది. ఈ సంస్థ ప్రపంచంలోని అనేక దేశాల్లో నిషేధించబడింది. ఈ...
విజయవాడ దసరా మహోత్సవముల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ
22
విజయవాడ ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 3 నుండి 12, 2024 వరకు జరిగే దసరా మహోత్సవాలకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు విజయవాడ ఎం.పి కేశినేని శివనాధ్, పశ్చిమ శాసనసభ్యులు...
జాతీయ నిర్థేశకులు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ
https://youtu.be/QkfZ1W2PKrA?si=kyn3xcXY2bcgKp5n...