News

వీహెచ్‌పీ ఆవిర్భావ దినోత్సవం రోజున దేశ వ్యాప్తంగా 9000 ప్రాంతాల్లో కార్యక్రమాలు : మిలింద్ పరాండే

54views

విశ్వహందూ పరిషత్‌ స్థాపించి 66 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా కార్యకర్తలు మరింత ఉత్సాహంతో పనిచేయాలని జాతీయ ప్రధాన కార్యదర్శి మిలింద్‌ పరాండే పిలుపునిచ్చారు. ఈ కాలంలో ప్రపచ వ్యాప్తంగా ఈ సంస్థ విస్తరించిందని, ప్రపంచంలోని 33 దేశాలకు వీహెచ్‌పీ విస్తరించిందని ప్రకటించారు. సమాజంలోని అన్ని వర్గాలను కలుపుకొని వెళ్లడమే తమ లక్ష్యమని, మనమందరమూ ఒక్కటేనన్న భావాన్ని హిందూ సమాజంలో తీసుకురావాలని, ఈ ఉద్దేశ్యాన్ని మేల్కొల్పడమే తమ లక్ష్యమన్నారు.

66 సంవత్సరాల సమయం పూర్తవుతున్న సందర్భంగా దేశంలోని ప్రతి గ్రామంలో సేవా కార్యక్రమాలు విస్తరింపజేస్తామని ప్రకటించారు. ఈ సంకల్పాన్ని తీసుకొని, వీహెచ్‌పీ కార్యకర్తలు హిందూ సమాజాన్ని సంఘటితం చేయాలని సూచించారు. వీహెచ్‌పీ ఆవిర్భావ దినోత్సవం రోజున దేశంలోని 9000 మండలాల్లో సేవా కార్యక్రమాలకు యోజన చేసినట్లు తెలిపారు. అయితే జార్ఖండ్‌ వేదికగా ఓ జాతీయ సభను కూడా నిర్వహించనున్నారు.