56
హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ ప్రాంత సంఘ చాలక్ కృష్ణంరాజు పిలుపునిచ్చారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్- ఆర్ఎస్ఎస్ గురుపూజోత్సవం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అనునిత్యం భగవంతుడిని నమ్ముతూ సనాతన ధర్మాన్ని కాపాడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఖండ్ ప్రముఖ్ పద్మనాభం, ఖండసేవాప్రముఖ్ కేఎల్ఎన్ మూర్తి, కేవీ రామచంద్రరావు, కేఎన్బీ గుప్త, నానాజీ గాడ్జే, జామి కామేశ్వరరావు, పోగోటి రాజారావు పాల్గొన్నారు.