జగన్నాథ రథయాత్ర అనంతపురం వాసులను భక్తిపారవశ్యంలో ముంచెత్తింది. ఇస్కాన్ అనంతపురం శాఖ ఆధ్వర్యంలో శనివారం బలభద్ర, సుభద్ర సమేత జగన్నాథుడిని రథంపై కొలువుదీర్చి నగర వీధులలో ఊరేగించారు. రథయాత్ర సాగే దారులను మహిళలు, యువతులు రంగవళ్లికలతో అలంకరించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు రథం ముందు సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. భక్తులు హరినామస్మరణ చేస్తూ, నృత్యాలు చేస్తూ ముందుకుసాగారు. రథోత్సవం ప్రారంభానికి ముందు కేఎస్ఆర్ కళాశాల వద్ద ఇస్కాన్ జాతీయ ప్రతినిధులు సత్యగోపీనాథ్దాస్, రాధామనోహర్దాస్ ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. భగవంతునికి, భక్తునికి మధ్య బంధానికి ప్రతీకలు ఇలాంటి రథయాత్రలు అని అన్నారు.
మనదేశంతోపాటు పాశ్చాత్య దేశాల్లోని నాలుగు వేల ప్రాంతాల్లో జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. జగన్నాథుడి రథయాత్రతో నగరం మరింత పవిత్రతను సంతరించుకుందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. దైవ దర్శనానికి ఆలయాలకు వెళ్లడం పరిపాటి అని, కానీ జగన్నాథుడే భక్తుల చెంతకు వచ్చి అనుగ్రహించడం జిల్లా ప్రజలు చేసుకున్న పుణ్యమని మాజీ మంత్రి శైలజానాథ్ అన్నారు. పూణె నుంచి వచ్చిన కళాకారుల బృందానికి మాసినేని రామయ్య రూ.3.5 లక్షల చెక్కును విరాళంగా అందజేశారు. ముఖ్య అతిథులు బంగారు వర్ణపు చీపుర్లతో రోడ్లను ఊడ్చగా… వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ స్వామివార్లకు పూజలు నిర్వహించి.. రథయాత్రను ప్రారంభించారు. కేఎ్సఆర్ కళాశాల వద్ద ప్రారంభమైన జగన్నాథ రథయాత్ర.. సప్తగిరి సర్కిల్, క్లాక్ టవర్, రాజురోడ్డు, శ్రీకంఠం సర్కిల్, తిలక్రోడ్డు, గాంధీబజార్, పాతూరు, బసవన్నకట్ట, సప్తగిరి సర్కిల్ మీదుగా లలిత కళా పరిషత్ వరకూ సాగింది.
49
You Might Also Like
లవ్ జిహాద్… ల్యాండ్ జిహాద్…. ఇప్పుడు పాన్ కార్డ్ జిహాద్
22
లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ అన్న పదాలు విన్నాం. కానీ.. పాన్ కార్డ్ జిహాద్ అని ఎప్పుడైనా విన్నామా? ఇప్పుడు వినాల్సి వస్తోంది. దాని గురించి తెలుసుకోవాల్సి...
శ్రీవారిని దర్శించుకోవాలంటే సంప్రదాయాలు పాటించాల్సిందే: శ్రీనివాసానంద సరస్వతి
18
తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే ఎవరైనా సంప్రదాయాలు పాటించాలని సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ అన్నారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘జగన్...
పాక్లో షియా, సున్నీ ముస్లింల పోరు.. 25 మంది మృతి
25
పాకిస్తాన్లోని వాయువ్య ప్రాంతంలో షియా, సున్నీ వర్గాలకు చెందినవారి మధ్య గత కొద్దిరోజులుగా భూ వివాదానికి సంబంధించి జరుగుతున్న ఘర్షణల్లో 25 మంది మృతి చెందారని పాక్...
మథురలో ఇక ప్రాచీన ప్రసాద వితరణే
11
ఉత్తర్ప్రదేశ్లోని మథురలో గల దేవాలయాల్లో ఇకపై భక్తులకు బహిరంగ మార్కెట్లో తయారయ్యే స్వీట్ల స్థానంలో ‘ప్రాచీన ప్రసాదం’ వితరణ చేయాలని స్థానిక హిందూ సంస్థ నిర్ణయించింది. ఆ...
స్వచ్ఛ భారత్ లో దేశవ్యాప్త గుర్తింపు సాధించిన నరసాపురం మహిళ
19
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణం పొన్నపల్లి వార్డులోని సత్యనారాయణమ్మ పరిశుభ్రత విషయంలో చేసిన ప్రయత్నాలు స్వచ్ఛ భారత్ దృష్టిని ఆకర్షించాయి. దివ్యాంగురాలైన ఆ మత్స్యకార మహిళ ఇద్దరు...
ప్రజ్ఞాన్ రోవర్కు చిక్కిన భారీ పురాతన బిలం
22
ప్రపంచ అంతరిక్ష చరిత్రలో భారత్ పేరును సువర్ణాక్షరాలతో లిఖించిన చంద్రయాన్ 3 ప్రయోగానికి సంబంధించి తాజాగా మరో కీలక విషయాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)...