News

దుర్గగుడికి రూ.28లక్షల విలువైన బస్సు బహూకరణ

76views

శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తరఫున రూ.28లక్షల విలువ చేసే బస్సును మంగళవారం బహూకరించారు. దేవస్థానం ఈఈ కోటేశ్వరరావుకు ఎస్‌బీఐ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ నారాయణశర్మ అందజేశారు. ఈసందర్భంగా బస్సుకు దేవస్థానం వైదిక కమిటీ సభ్యులు పూజ చేశారు. అనంతరం బ్యాంకు అధికారులు బస్సు తాళాలను దేవస్థానం అధికారులకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో డీజీఎంలు మనీష్‌కుమార్‌ సింగ్, దినేష్‌ గులాటి, దేవస్థానం డీఈ కోటేశ్వరరావు పాల్గొన్నారు.