విజయనగరంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని హిందూ ధర్మ రక్ష సమితి ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కేంద్రంలో శనివారం భారీ హనుమాన్ శోభాయాత్ర నిర్వహిస్తున్నామని సమితి రాష్ట్ర కార్యదర్శి నందివాడ వేణుగోపాల్, అధ్యక్షుడు అబోతుల శ్యాంసుందర్లు ప్రకటించారు. శుక్రవారం ఈ మేరకు స్థానిక ప్రైవేట్ కల్యాణమంటపంలో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా కార్యదర్శి శఠగోపం పార్థసారథితో కలిసి వారు మాట్లాడారు. కొత్తపేటలో గల కొత్తకోవెల నుంచి హనుమాన్ విగ్రహాలతో కార్యక్రమం ప్రారంభమై సాయంత్రం కోట నుంచి మూడు లాంతర్లు జంక్షన్, గంటస్తంభం, కన్యకాపరమేశ్వరి కోవెల, రైల్వేస్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్, బాలాజీ జంక్షన్ మీదుగా తిరిగి కోట జంక్షన్కు శోభాయాత్ర చేరుకుంటుందని తెలిపారు. అంగరంగ వైభవంగా జరిగే ఈ హనుమాన్ శోభా యాత్రలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని హనుమాన్ సహిత సీతారాముల వారి కృపకు పాత్రులు కాగలరని కోరారు.
76
You Might Also Like
బంగ్లాదేశ్లో హిందువుల ఊచకోతపై అమెరికాలో ఎయిర్లైన్ బ్యానర్
అమెరికాలోని హిందూ సంస్థలు భారీ ఎయిర్లైన్ బ్యానర్తో ప్రపంచానికి తమ విజ్ఞప్తిని బలంగా వినిపించారు. బంగ్లాదేశ్లో హిందువుల ఊచకోతను ఆపడానికి ప్రపంచదేశాలు అత్యవసరంగా స్పందించాలని వారు డిమాండ్...
వారధి ఫిర్యాదులో లవ్ జిహాద్ కేసు
10
ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారం దిశగా ప్రయత్నించడానికి భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిన ‘వారధి’ కార్యక్రమంలో లవ్జిహాద్ కేసు వెలుగుచూసింది. శుక్రవారం కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ...
త్రిపురాంతకేశ్వర ఆలయంలో బయటపడిన.. 14వ శతాబ్దం నాటి శాసనం
46
ప్రకాశం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ త్రిపురాంతకేశ్వరస్వామి ఆలయంలో 14వ శతాబ్దం నాటి మరో శాసనం వెలుగు చూసింది. ఆలయ ప్రాంగణంలోని నంది పక్కనే ఉన్న ఓ...
నారీశక్తికి ప్రతీక రాణి దుర్గావతి
* 500వ జయంతి సందర్భంగా సంస్మరణ - హనుమత్ ప్రసాద్ రాణి దుర్గావతి పేరు వినగానే నారీశక్తికి వున్న గౌరవం గుర్తుకు వస్తుంది. స్వధర్మం కోసం, దేశం...
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. ఏడుగురి మావోయిస్టుల మృతి
42
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ఛత్తీస్గఢ్లోని దంతెవాడ-...
ప్రపంచాన్ని చుట్టిరానున్నఇద్దరు నేవీ ఆఫీసర్లు..!
57
భారత నావికాదళానికి చెందిన ఇద్దరు మహిళా అధికారులు అపూర్వ సాహస యాత్రకు శ్రీకారం చుట్టారు. ఎనిమిది నెలల్లో సముద్రంపై ప్రపంచాన్ని చుట్టిరావడానికి బుధవారం గోవా నుంచి బయలుదేరారు....