News

శ్రీకృష్ణ జన్మభూమి- షాహి ఈద్గా కేసుల విచారణార్హతపై తీర్పు రిజర్వు

117views

ఉత్తర్ ప్రదేశ్ లోని మథురలో శ్రీకృష్ణ జన్మభూమి- షాహి ఈద్గా వివాదానికి సంబంధించిన కేసుల విచారణార్హతపై అలహాబాద్ హైకోర్టు శుక్రవారం తన తీర్పును రిజర్వు చేసింది. కృష్ణుడి ఆల యానికి పక్కనే ఉన్న షాహి ఈద్గా మసీదును తొలగించాలని గతంలో అనేక కేసులు నమోదయ్యాయి. ఔరంగజేబు కాలంనాటి ఈ మసీదును ఆలయాన్ని కూల్చేసి నిర్మించారని హిందువుల తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. మరోవైపు, ప్రార్థనా స్థలాల చట్టం 1991, వక్స్ చట్టం ప్రకారం ఈ కేసులు నిషేధమని ముస్లింల తరఫు న్యాయవాది వాదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న జస్టిస్ మయాంక్ కుమార్ జైన్ తీర్పును రిజర్వు చేశారు.