విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో భక్తుల రద్దీని నియంత్రించేందుకు దేవస్థాన ఈవో కేఎస్ రామారావు చర్యలు చేపట్టారు. ఇటీవల శుక్ర, శని, ఆదివారాలలో రోజుకు కనీసం 40 నుంచి 50 వేలమంది భక్తులు తరలిరావటం, పరిమిత సంఖ్యలో క్యూల వద్ద సిబ్బందితో నియంత్రణ కష్టతరమైంది. ఈ క్రమంలో తాజాగా వాహనాల పార్కింగ్కు పలు చర్యలు చేపట్టారు. శుక్ర, శని, ఆదివారాలలో ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విధులు నిర్వహించేందుకు అదనపు సిబ్బందిని నియమించారు. అంతరాలయం వద్ద, రూ.300, రూ.100 క్యూలైన్లు, టికెట్ స్కానింగ్ పాయింట్ వద్ద, మల్లేశ్వరాలయం వద్ద ఓవరాల్ పర్యవేక్షణకు పలువురు సిబ్బంది విధులు నిర్వహిస్తారు. శుక్ర, శని, ఆదివారాలలో ట్రాఫిక్ను నియంత్రించేందుకు, టోల్గేట్ల, కనకదుర్గానగర్ వద్ద సెక్యూరిటీలకు ప్రత్యేక విధులు కేటాయించాలని సూచించారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమలులోకి వస్తాయని ఈ నెల 31వ తేదీ నుంచే ఉద్యోగులు, సిబ్బంది విధుల్లో చేరాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు. రద్దీ నియంత్రణలో విఫలం చెందితే సంబంధిత ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వన్టౌన్ పోలీస్స్టేషన్ నుంచి 20 మంది పోలీసు సిబ్బందిని నియమిస్తున్నారు.
80
You Might Also Like
ఆ ఊరికి హనుమాన్ మళ్ళీ వచ్చాడు..!
57
మా ఊరికి ఆ హనుమంతుడే స్వయంగా మళ్ళీ వచ్చాడంటూ ఆ ఊరి జనం మురిసిపోతున్నారు. వాగులో కొట్టుకొచ్చిన ఆంజనేయ విగ్రహాన్ని చూసిన జనం భక్తి పారవశ్యంలో తలమునకలేస్తున్నారు....
లవ్ జిహాద్తో దేశ ఐక్యతకు ముప్పు
30
లవ్ జీహాద్ మన దేశానికి పెను ముప్పు అని ఉత్తరప్రదేశ్లోని ఓ కోర్టు హెచ్చరించింది. ఓ కమ్యూనిటీకి చెందిన సంఘ వ్యతిరేక శక్తులు భారతదేశంపై ఆధిపత్యాన్ని సాధించేందుకు...
తిరుమల గొడుగుల ఊరేగింపు
36
చెన్నైలోని చెన్నకేశవ పెరుమాళ్ ఆలయంలో తిరుమల గొడుగుల ఊరేగింపును తిరుకంకుడి జీయర్ రామానుజ స్వామి బుధవారం ప్రారంభించారు. తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా చెన్నైకి చెందిన హిందూ ధర్మార్ధ...
ఏబీవీపీ ఆధ్వర్యంలో జనజాతి విద్యార్థుల సమ్మేళనం
31
ఆధునిక ప్రపంచంలో గిరిజన సంస్కృతి, ఆచారాలు కాపాడుకోవాల్సిన బాధ్యత నేటి తరంపై ఉందని ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి.శంకరరావు అన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్...
కోల్కతా ర్యాలీలో కశ్మీర్ ఆజాదీ నినాదాలు
32
ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలిపై హత్యాచార ఘటనకు నిరసనగా నిర్వహించిన ర్యాలీలో కశ్మీర్ ఆజాదీ అంటూ నిరసనకారులు నినాదాలు...
అయోధ్యకు పోటెత్తిన భక్తజనం
39
దేశవ్యాప్తంగా శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈ నేపధ్యంలో అమ్మవారి ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. పలు దేవాలయాలకు నిలయమైన అయోధ్యకు చేరుకున్న వేలాది మంది భక్తులు ఉదయం నుండి...