ArticlesNews

భారత్ లో తగ్గిన హిందూ జనాభా, పొరుగుదేశాల్లో మాత్రం మరోలా…?

135views

భారత్ లో హిందువుల వాటా గత కొన్ని దశాబ్దాలుగా తగ్గినట్టు ప్రధాని ఆర్థిక సలహా మండలి (పీఎమ్- ఈఏసీ) నేతృత్వంలో జరిపిన తాజా అధ్యయనంలో తేలింది. పొరుగు దేశాల్లో మాత్రం ఇందుకు భిన్నమైన గణాంకాలు నమోదు అయ్యాయి. అక్కడ మెజారిటీ మతస్తుల సంఖ్య పెరిగినట్టు అధ్యయనంలో తేలింది.

1950-2015 మధ్య భారత్‌లో మెజారిటీ మతస్తులైన హిందువుల జనాభా వాటా 7.8 శాతం మేర తగ్గగా, మైనారిటీలైన ముస్లింలు, క్రిస్టియన్లు, బౌద్ధులు, సిక్కుల వాటా పెరిగింది. జైనులు, పార్సీల సంఖ్య మాత్రం తగ్గింది.తాజా అధ్యయనం మేరకు గత 65 ఏళ్ళలో దేశ జనాభాలో హిందువుల వాటా 84 శాతం నుంచి 78 శాతానికి పడిపోగా ముస్లింల వాటా 9.84 శాతం నుంచి 14.09 శాతానికి పెరిగింది.

మెజారిటీ
మతస్తుల వాటా తగ్గుదల దేశాల జాబితాలో మయాన్మార్ (10 శాతం) తరువాతి స్థానంలో భారత్ ఉంది. నేపాల్‌లో హిందువుల వాటా 3.6 శాతం మేర తగ్గింది.

పాకిస్తాన్ లో మెజారిటీ మతస్తుల వాటా 3.75 శాతం పెరిగింది. బంగ్లాదేశ్‌ జనాభాలో ముస్లింల వాటా అత్యధికంగా 18.5 శాతం పెరిగింది. బౌద్ధం ప్రధానమతంగా ఉన్న శ్రీలంక, భూటాన్ దేశాల్లో మెజారిటీ మతస్తుల వాటా వరుసగా 17.6 శాతం, 5.25 శాతం మేర పెరిగింది.