News

పాక్‌ను మన దేశం గౌరవించాలి : మణిశంకర్ అయ్యర్ విదాస్పద వ్యాఖ్యలు

206views

లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ నేతలు వరుసగా చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఇటీవల జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శాం పిట్రోడా వివాదం చల్లారకముందే, ఇప్పుడు మరో కాంగ్రెస్‌ నేత మణి శంకర్‌ అయ్యర్‌ పాకిస్థాన్‌కు మద్దతుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌ సార్వభౌమాధికార దేశమని, దాని వద్దా అణుబాంబు ఉందని, ఈ నేపథ్యంలో ఆ దేశానికి మన దేశం గౌరవం ఇవ్వాలని మణిశంకర్‌ అయ్యర్‌ పేర్కొన్నారు. ఆ దేశంలో ఓ పిచ్చివాడు అధికారంలోకి వచ్చి..అణుబాంబును ప్రయోగిస్తే అది మంచిది కాదని..ఆ ప్రభావం మనదేశంపైనా పడుతుంది అని హెచ్చరించారు. మన ప్రభుత్వం పొరుగు దేశంతో మాట్లాడానికి బదులుగా మన సైనిక శక్తిని పెంచుకుందామని అంటోందని, దీనివల్ల ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయన్నారు. ఈ మేరకు మణిశంకర్‌ అయ్యర్‌ పేర్కొంటున్నట్లున్న ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.