తిరుమలలో దళారులు, కేటుగాళ్ల బెడద తగ్గిపోయింది.. టీటీడీ కఠిన చర్యలు తీసుకోవడంతో ఇటీవల కాలంలో మోసాలు జరగడం లేదు. అయితే తాజాగా మరో ఇద్దరు దళారుల గుట్టురట్టైంది. తిరుమలకు వచ్చే భక్తుల్ని మోసం చేస్తున్నవారిపై పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. వీరిద్దరు ప్రజాప్రతినిధుల సిఫార్సులు లేఖలు దుర్వినియోగం చేస్తూ.. తిరుమల శ్రీవారి దర్శన టికెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. తమిళనాడు కృష్ణగిరి జిల్లాకు చెందిన బీఆర్ విష్ణు రెండు రోజుల క్రిత తిరుమల వచ్చారు. ఆయన శ్రీవారి బ్రేక్ దర్శనం కోసం చెన్నైకు చెందిన కృష్ణమూర్తి రఘురామన్, తిరుపతికి చెందిన కె.పళణి వెంకటేష్లను కలిశారు. ఆయనకు చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి సిఫారసు లేఖ ఇచ్చి.. ఐదు బ్రేక్ దర్శనం టికెట్లను రూ.35వేలకు విక్రయించారు. అయితే తర్వాత మోసపోయినట్లు గుర్తించిన భక్తులు టీటీడీ విజిలెన్స్ వింగ్కు ఫిర్యాదు చేశారు. మరోవైపు హైదరాబాద్కు చెందిన దత్తాత్రేయ అనే భక్తుడు కూడా శ్రీవారి దర్శనం కోసం దళారి కృష్ణమూర్తి రఘురామన్ను సంప్రదించారు. రూ. 15 వేలకు 3 టిక్కెట్లను విక్రయించగా.. ఆయన కూడా మోసపోయినట్లు గుర్తించి టీటీడీ విజిలెన్స్ అధికారుకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపరిచారు.. వారికి కోర్టు రిమాండ్ విధించింది. దర్శనం టికెట్ల కోసం దళారులను నమ్మొద్దని, మోసపోవద్దని విజిలెన్స్ సిబ్బంది భక్తులకు సూచించారు.
125
You Might Also Like
శ్రమే దైవం
( మే 1 - అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ) ఏ పని సాధించాలన్నా మొదట కృషి చేయాలి. ఆనక దైవం అనుగ్రహించాలి. పట్టుదలతో శ్రమిస్తూ.. పర్యావరణంలో...
ఈ స్కూల్లో ఫీజుకు బదులు ప్లాస్టిక్ ఇస్తే చాలు..
48
ఓ ప్రైవేట్ స్కూల్ మిగతా ప్రైవేట్ స్కూల్ అన్నింటికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఆ ప్రైవేట్ స్కూల్ పేరుకి చాలా ఫేమస్, అంత పెద్ద పేరున్న స్కూల్లో చదవాలంటే...
నేవీ చీఫ్ అడ్మిరల్ గా దినేష్ కుమార్ త్రిపాఠి బాధ్యతలు స్వీకరణ
50
నేవీ చీఫ్గా అడ్మిరల్ గా దినేష్ కుమార్ త్రిపాఠి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో నావికాదళ కార్యకలాపాల డైరెక్టర్ జనరల్గా, వెస్ట్రన్ నేవల్ కమాండ్కు ఫ్లాగ్ ఆఫీసర్...
జ్యోతిర్లింగాల దర్శనం కోసం స్పెషల్ యాత్ర
59
మహాదేవ్ భక్తులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. అది ఏంటంటే దేశంలోని ప్రముఖ జ్యోతిర్లింగాల దర్శనం కోసం ఐఆర్సీటీసీ దేవ్ దర్శన్ యాత్రను ప్రారంభిస్తోంది. ఈ క్రమంలో దేవ్...
బలవంతులే ఆధ్యాత్మిక సాధకులు
57
స్వామి వివేకానంద తమిళనాట ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇస్తున్న రోజులవి. ఒకరోజు సాయంత్రం వారు బస చేసిన విడిదికి బక్కపలచగా, బలహీనంగా ఉన్న ఇరవై ఏళ్ల యువకుడు వచ్చాడు....
పేకేరు సర్పంచ్ కి అరుదైన గౌరవం… సదస్సులో మాట్లాడాలంటూ ఐరాస ఆహ్వానం
50
పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన ఇరగవరం మండలం పేకేరు సర్పంచ్ కునుకు హేమ కుమారికి అరుదైన గౌరవం దక్కింది. ‘భారత్లో స్థానిక సంస్థల ప్రభుత్వాల్లో మహిళల పాత్ర,...