
359views
పాట్నా: బీహార్ ప్రభుత్వ అధికారిక సమావేశాల్లో లాలూ అల్లుడు పాల్గొనడం కొత్తగా ఏర్పడిన కూటమిని తీవ్ర ఇబ్బందుల్లో పడేసింది. లాలూ పెద్ద కుమారుడు, అటవీ శాఖ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్.. ఏర్పాటు చేసిన మీటింగ్లో ఆయన బావ పాల్గొనడంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శిస్తున్నాయి.
ఈనెల 17న ఏర్పాటు చేసిన కాలుష్య నియంత్రణ మండలి అధికారుల సమావేశానికి మంత్రి తేజ్ ప్రతాప్ హాజరయ్యారు. ఆయనతో పాటు.. తన సోదరి మిసా భారతి భర్త శైలేశ్ కుమార్ కూడా సమావేశానికి హాజరయ్యారు. కుమార్.. ఎంపీలు కూర్చునే సీట్లకు వెనుక వరుసలో కూర్చొని కనిపించారు. మరుసటి రోజు ఏర్పాటు చేసిన అదే సమావేశంలో శైలేశ్ తన బావమరిది మంత్రి తేజ్ ప్రతాప్ పక్కనే కూర్చొని కనిపించారు. ఈ ఘటనపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది.





