
-
నేర రహిత క్షేత్రంగా మారనున్న తిరుమల
-
కమాండ్ కంట్రోల్ను పరిశీలించిన అధికారులు
తిరుపతి: తిరుమలలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అత్యుత్తమ భద్రతా వ్యవస్థను రూపొందించారు. సీవీఎస్వో గోపినాథ్జెట్టి కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరును వివరించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ 24 గంటలు మూడు షిప్ట్లలో పనిచేస్తునట్టు తెలిపారు. ప్రస్తుతం తిరుమలలో అన్ని ప్రాంతాలను 1650 సిసి కెమెరాల నిఘాలో నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు.
మూడో దశలో మరో 1,400 సిసి కెమెరాల ఏర్పాటు ప్రక్రియ జరుగుతున్నట్టు వివరించారు. నేరం జరిగిన వెంటనే దగ్గరలోని మొబైల్ భద్రతా సిబ్బంది ట్యాబ్కు మేసేజ్ వెలుతుందని, సిబ్బంది తక్కువ సమయంలో అక్కడకు చేరుకుని నేరాలను అరికట్టవచ్చని చెప్పారు.
భక్తులు రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సిసి కెమెరాల పనితీరును, శేషాచల అడవుల్లోని వన్యమృగాలు జన సంచారం ఉన్న ప్రాంతాల్లోకి వచ్చినప్పుడు సిసిటివిలో రికార్డు అయిన వెంటనే, అటోమేటిక్గా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సైరన్లు మోగి జంతువులు అడవిలోకి వెళ్ళిపోయే విధానానం గురించి చెప్పారు.
తిరుమలలో దళారులను, దొంగలను పట్టుకోవడం, తప్పిపోయిన వారి ఆచూకీ కనుగొని వారి బంధువులకు అప్పగించిన వీడియో క్లిపింగ్లను వీడియో వాల్ ద్వారా చూపించి వివరించారు.





