News

నిరాద‌ర‌ణ‌కు గురైన ఆదిశంక‌రాచార్య జ‌న్మ‌స్థ‌లం

892views
  • నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీ చైర్మన్ తరుణ్ విజయ్

కొచ్చి: ఆదిశంకరాచార్య జన్మస్థలాన్ని నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీ చైర్మన్ తరుణ్ విజయ్ ఇటీవ‌ల సంద‌ర్శించారు. ఆదిశంకర ఆలయ ప్రాంగణంలో ఆయన రుద్రాక్ష మొక్కను నాటారు. వారసత్వ సంపదను పరిరక్షించడంలో, వలసవాద చరిత్రకారులు మన వారసత్వానికి చేసిన చారిత్రక తప్పిదాలను తొలగించడంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో శ్రద్ధ వహిస్తున్నారని ఆయన అన్నారు.

పక్షపాత చరిత్రకారులు, వలసవాద మనస్తత్వం కారణంగా, అఫ్జల్ ఖాన్(శివాజీ చేత తొలగించబడిన) అరవై-రెండు మంది భార్యల శ్మశానవాటిక బ్రిటిష్ పాలనలో జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా ప్రకటించబడింద‌న్నారు. అయితే, మన నాగరికత పునరుజ్జీవనం గొప్ప ప్రదేశమైన‌ కాలడి శంకర జన్మస్థలం లాంటివి పట్టించుకోక‌పోవ‌డంతో నిరాద‌ర‌ణ‌కు గురైంద‌న్నారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి