News

ఆ MP కి జాతీయగీతం పాడ్డం కూడా రాదు

577views

ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు, ఎమ్మెల్యేలకు జనగణమన పాడడం రాలేదు. జనగణమన పాడడం తెలియక సదరు నాయకుడు మాత్రమే కాకుండా అతడి అనుచరులు కూడా దిక్కులు చూశారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున మొరాదాబాద్‌లో జాతీయ పతాకాన్ని ఎగురవేసినప్పుడు సమాజ్ ‌వాదీ పార్టీ ఎంపీ ఎస్టీ హసన్, ఆయన మద్దతుదారులు జాతీయ గీతంలోని పదాలను మర్చిపోయారు. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించాక ‘జన గణ మన’ మొదటి చరణాన్ని పాడారు. ఆ తరువాతి చరణాలను మరచిపోయారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హసన్ నవాబ్ మజ్జు ఖాన్ సమాధి వద్దకు చేరుకుని నివాళులర్పించారు. అనంతరం గుల్ షాహిద్ పార్క్‌లో జరిగిన కార్యక్రమంలో జాతీయ జెండాను ఎగురవేశారు.

మొదట గట్టిగా పాడిన నాయకుడు ఆయన అనుచరులు.. ఆ తర్వాత పదాలు గుర్తుకు రాక ఒకరి ముఖాలు మరొకరు చూసుకున్నారు. చివరికి పాడేశామని భావించి.. జయహే.. జయహే అంటూ ముగించేశారు. జెండా ఎగురవేసిన అనంతరం ఎంపీ హసన్ ‌తో పాటు ఆయన కార్యకర్తలు జనగణమన ప్రారంభించారు. వారు జాతీయ గీతాన్ని.పాడుతూ మధ్యలో మరచిపోయి ఇష్టమొచ్చినట్టు పాడారు. చివరకు జయ జయహే అనేది కూడా పూర్తిగా అనకుండానే ముగించారు. జాతీయ గీతం ఆలపిస్తుండగా ఎంపీ హసన్‌ బిత్తరచూపులు చూశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.