News

హిందూ సంస్థల నాయకులపై ఉగ్ర కుట్ర – ఇద్దరు PFI సభ్యుల అరెస్టు

652views

PFI తీవ్రవాద సంస్థ దేశంలోని ప్రముఖ హిందూ నాయకులను అంతం చెయ్యడమే లక్ష్యంగా చేసుకున్నట్లు కేంద్రం ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన హెచ్చరికతో అప్రమత్తం అయిన ఉత్తరప్రదేశ్ పోలీసులు ఫిబ్రవరి 11 న కొంత మంది అనుమానాస్పద వ్యక్తులు యూపీకి వచ్చారనే సమాచారం రావడంతో, దాని ఆధారంగా దర్యాప్తు, తనిఖీలు చేపట్టి నప్పటికీ వారిని గుర్తించలేకపోయారు.

అయితే ఉత్తరప్రదేశ్ టాస్క్ ఫోర్స్ కి వచ్చిన పక్కా సమాచారం మేరకు ‘వసంత పంచమి’ రోజున కొంత మంది హిందూ నాయకులను హత్య చేసి ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించే లక్ష్యంతో ఉన్నారనే సమాచారంతో ఇద్దరు మలయాళీ పాపులర్ ఫ్రంట్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వారి వద్ద నుంచి భారీ పేలుడు పదార్థాలు, మందుగుండు సామాగ్రి, 32 బోర్ పిస్టల్స్, ఏడు రౌండ్ల బుల్లెట్లు, నాలుగు ఎటిఎం కార్డులు, పాన్ కార్డులు, నగదు, పెన్ డ్రైవ్, మెట్రో కార్డు, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మందుగుండు సామాగ్రి, ఇతర వస్తువులను విలేఖరుల ముందు ప్రదర్శించారు. అరెస్టయిన ఉగ్రవాదులు కేరళ కి చెందిన అన్సాద్ బదిరుద్దీన్, ఫిరోజ్ ఖాన్ అని, వారు కేరళలోని పతన మిట్ట, కోజికోడ్ చెందిన వారని పోలీసులు పేర్కొన్నారు.

కొంత మంది పాపులర్ ఫ్రంట్ కార్యకర్తలు దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారని యుపి స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) కు సమాచారం వచ్చింది. అరెస్టయిన ఇద్దరు ఉగ్రవాదులు ఇచ్చిన సమాచారం ప్రకారం హిందూ సంస్థల నాయకులే లక్ష్యంగా వివిధ రాష్ట్రాలలో కొంత మంది శారీరకంగా బలంగా ఉన్న యువకులను PFI నియమించుకుంటున్నారు. వారు పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను నిల్వ చేస్తున్నారు. వీరి లక్ష్యం ప్రజలలో భయాన్ని రేకెత్తించడం, సమాజంలో అలజడులు సృష్టించే లక్ష్యంతో ఈ దాడులు జరపడంతో పాటు సామాజిక మరియు మత సామరస్యాన్ని నాశనం చేసే ప్రణాళికలు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.