News

దేవాలయాలను ప్రభుత్వ నియంత్రణ నుంచి విముక్తి చేయాలి : హిందూ సంఘాల కీలక ప్రకటన

114views
తిరువణ్ణామలై కేంద్రంగా ఓ కీలక సమావేశం జరిగింది. హిందూ చైతన్యం ఓట్ల రూపంలోకి మారేలా ఓ ప్రయత్నం జరిగింది. రాబోయే ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ అయినా హిందువుల డిమాండ్లు నెరవేర్చేలా వుండాల్సిందేనని తేల్చి చెప్పారు. అలాంటి వారే రాబోయే ఎన్నికల్లో హిందువుల ఓట్లు పొందడానికి అర్హత పొందుతారని సమావేశం కచ్చితంగా ప్రకటించింది.
పూజారీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ‘‘హిందువుల హక్కులను తిరిగి పొందడం’’ అనే థీమ్ తో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సమాఖ్య అధ్యక్షుడు రాజా, అఖిల భారత సాధుసంఘం వ్యవస్థాపకులు రామానంద స్వామిగల్‌, వీహెచ్‌ఐ దక్షిభారత్‌ సంయుక్త ప్రధాన కార్యదర్శి స్తానుమాల్యన్‌, మన్నగూరి సీర్‌ రాముంజ చెందలంగార జీర్‌ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సమాఖ్య అధ్యక్షుడు రాజా మాట్లాడుతూ HRCE ఆధీనంలో వున్న ఆలయ ప్రయోజనాలను కాపాడాలని, వాటిని నాశనం చేయవద్దన్నారు. తిరుపరంకుండ్రం కార్తిక దీపం వెలిగింపు విషయంలో కోర్టు ఆదేశాలను అమలు చేయడం, వాటిని గౌరవించడం HRCE విధి అని అన్నారు.ఇలా చేయకుండా హిందువుల హక్కులను కాలరాసేలా అప్పీలుకు కూడా వెళ్లిందని మండిపడ్డారు.అంతేకాకుండా కోర్టు ఆదేశాలను ధిక్కరించిందని కూడా పేర్కొన్నారు.
దైవ దర్శనానికి ఎలాంటి రుసుము లేకుండా దర్శనం అనుమతించాలని డిమాండ్ చేశారు. HRCE టిక్కెట్లరూపంలో ఛార్జీలు వసూలు చేస్తోందని, దీంతో భక్తులు తీవ్ర నిరాశలో వున్నారన్నారు. దీని ద్వారా ధనవంతులకు మాత్రమే దర్శనం దొరికే అవకాశాలున్నాయన్నారు. పేదలైన భక్తులకు దర్శనం అనేది సుదూర కలగానే మిగిలిపోయే ప్రమాదం వుందని హెచ్చరించారు.
tamiklnad2u
అలాగే దేవాలయాలను ప్రభుత్వ నియంత్రణ నుంచి విముక్తి చేయాలని కూడా డిమాండ్ చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని, ప్రభుత్వం హిందువులను రెండో తరగతి పౌరులుగా చూస్తోందని స్తానుమల్యన్ మండిపడ్డారు. సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి ప్రపంచ దేశాలు భారత్ లో మత మార్పిళ్లను చురుగ్గా ప్రోత్సహిస్తున్నాయని మండిపడ్డారు. ఇతర మతాల్లోకి మారిన వారికి కూడా ప్రభుత్వం రిజర్వేషన్ ప్రయోజనాలు పొందుతున్నారని ఇది రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు.వీటన్నింటినీ వ్యతిరేకించేవారికి, తమ హిందువుల డిమాండ్లను అంగీకరించే వారికే రాబోయే ఎన్నికల్లో హిందువుల ఓట్లు లభిస్తాయని కీలక ప్రకటన చేశారు.
ముఖ్యమైన 11 తీర్మానాలను ఆమోదించిన సభ…
ఈ సందర్భంగా సభ 11 తీర్మానాలను ఆమోదించింది. అందులో ముఖ్యమైనవి ఏమిటంటే.. పదవీ విరమణ పొందిన ఆలయ పూజారులకు 500 పెన్షన్ ఇవ్వాలని, ప్రభుత్వ పధకాల ప్రయోజనాలను పొందడానికి ప్రభుత్వం వార్షిక ఆదాయాన్ని 7200 కి సవరించి పెంచాలని కూడా డిమాండ్ చేశారు.అలాగే వారు మరణిస్తే… వారి భార్యలకు పెన్షన్ వర్తింపజేయాలని కూడా డిమాండ్ చేశారు.
వీటితో పాటు ఆలయ పూజారులకు నెలవారీ కనీసం రూ.10000 గ్రాట్యుటీ ఇవ్వాలని, ఆలయ ఆస్తులను తిరిగి ఆలయాలకే ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. సనాతన ధర్మంపై, దేవుడిపై నమ్మకం వున్న వారినే ఆలయ ధర్మకర్తలుగా నియమించాలని, ఆలయాల ఆదాయాన్ని ఆలయాల అభివృద్ధికే ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు.