
109views
ఒడిశా భువనేశ్వర్లోని ప్రసిద్ధ శుకసారి మందిరం శిథిలాల కింద అత్యంత అరుదైన, పురాతనమైన దేవీ మందిరం బయల్పడింది. లింగరాజ్ ఆలయం సమీపంలోని బిందుసాగర్ చెరువు వద్ద, భారత పురాతత్వ శాఖ (ASI) తవ్వకాలలో ఈ 13వ శతాబ్దపు కళింగ శైలి దేవీ మందిరం వెలుగులోకి వచ్చింది. ఈ అరుదైన ఆలయం ఖఖరా శైలికి చెందినదని పరిశోధకులు తెలిపారు. ఈ అరుదైన దుర్గాదేవి ఆలయం లింగరాజ్ ఆలయ ఉత్తర ద్వారం, మిందుసాగర్ చెరువు సమీపంలోని శుకసారి మందిరం కింద ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ ఆలయం ఖఖర శైలి అంటే శైవ, శాక్త సాంప్రదాయల మిశ్రమాన్ని తెలియజేస్తుంది. ఇప్పటి వరకు ఒడిశాలో 23 ప్రసిద్ద పురాతత్వ సంరక్షిత ఆలయాలున్నాయి. అందులో 15 ఆలయాలు ఈ ఖఖర శైలిలో ఉన్నాయి. శుకసారి దేవాలయం తో పాటుగా దాని పక్కనే ఉన్న సారీ దేవుళ చుట్టుపక్కల ఉన్న ఈ ప్రదేశం, కళింగ శైలి వాస్తుశిల్పానికి, ముఖ్యంగా 13వ శతాబ్దపు రాజు నరసింహ దేవ్ I కాలం నాటి కళాఖండాలకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ అద్భుతమైన ఆవిష్కరణ చారిత్రక సంపదను, శైవ-శాక్త సమ్మేళనాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి దోహదపడుతుంది అని పరిశోధకులు భావిస్తున్నారు. .





