
కత్రాలోని శ్రీ మాతా వైష్ణోదేవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎక్సలెన్స్ అడ్మిషన్స్ పై ఓ వివాదాస్పద కోణం వెలుగులోకి వచ్చింది. ఎంపికైన మొదటి బ్యాచ్ విద్యార్థులలో 90 శాతం మంది కాశ్మీర్కు ముస్లిం విద్యార్థులే ఉండడం ఆందోళనకు దారితీసింది. ఆ అడ్మిషన్ జాబితాను రద్దు చేయాలని డిమాండ్ లు తెరపైకి వస్తున్నాయి. జాతీయవాదులతో పాటు హిందూ సంస్థలైన విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ కూడా డిమాండ్లు చేస్తున్నాయి.
వైష్ణోదేవి మందిరానికి ఇచ్చే విరాళాలతో ఏర్పాటు చేసిన సంస్థ ముస్లిం సమాజ సభ్యుల ఆధిపత్యంలో ఉండకూడదని, హిందువులకు సీట్లు రిజర్వ్ చేయబడాలని వారు డిమాండ్ చేస్తున్నారు.వైష్ణోదేవి వైద్య సంస్థకు జమ్మూ కాశ్మీర్ బోర్డ్ ఆఫ్ ప్రొఫెషనల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ 50 మంది అభ్యర్థుల జాబితాను క్లియర్ చేసిన తర్వాత నిరసనలు చెలరేగాయి. వారిలో 42 మంది కాశ్మీర్కు చెందినవారు, ఎనిమిది మంది జమ్మూకు చెందినవారు. వారిలో, కాశ్మీర్కు చెందిన 36 మంది, జమ్ముకు చెందిన ముగ్గురు ఇప్పటికే అడ్మిషన్ పొందారు.
కాట్రా ఇన్స్టిట్యూట్ వెలుపల విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ప్రదర్శనలు నిర్వహించి వైష్ణో దేవి పుణ్యక్షేత్ర బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దిష్టిబొమ్మను దహనం చేశాయి. 2025-26 సెషన్కు అడ్మిషన్లను నిలిపివేయాలని, యాజమాన్యం తన “తప్పు”ను సరిదిద్దుకోవాలని, తదుపరి దానికి ఎంపికైన విద్యార్థులలో ఎక్కువ మంది హిందువులే ఉండేలా చూసుకోవాలని పరిషత్ జమ్మూ కాశ్మీర్ అధ్యక్షుడు రాజేష్ గుప్తా డిమాండ్ చేశారు.
ఈసారి రూపొందించిన 50 మంది జాబితాను “వైద్య కళాశాలను ఇస్లామీకరించడానికి కుట్ర” అని ఆయన ఆరోపించారు. జాబితాను సిద్ధం చేయడంలో బోర్డు పక్షపాతం చూపిందని బజరంగ్ దళ్ ప్రాంత అధ్యక్షుడు రాకేష్ బజరంగీ ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఉన్న యాత్రికుల విరాళాల నుండి కళాశాలను ఏర్పాటు చేసినందున, భారతదేశం నలుమూలల నుండి అభ్యర్థులు ఉన్న కేంద్ర నీట్ పూల్ నుండి యాజమాన్యం అడ్మిషన్లు చేయించాలని ఆయన స్పష్టం చేశారు.
“కాశ్మీర్ నుండి అభ్యర్థులు మరే ఇతర వైద్య కళాశాలలో అడ్మిషన్ తీసుకోవడానికి మాకు అభ్యంతరం లేదు. కానీ వైష్ణో దేవి మందిర విరాళాలతో ముందుకు వచ్చినందున వైష్ణోదేవి కళాశాలలో హిందూ అభ్యర్థులకు సీట్లు రిజర్వ్ చేయాలి” అని జాతీయవాదులు డిమాండ్ చేస్తున్నారు.





