
165views
భారత నౌకాదళంలోకి మరో స్వదేశీ యుద్ధనౌక వచ్చి చేరింది. జలాంతర్గాముల ఉనికిని పసిగట్టే యాంటీ సబ్మెరైన్ వార్షిప్ ‘ఆండ్రోత్’ భారత నావికాదళంలో అడుగుపెట్టింది. కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్, ఇంజనీర్స్ (జీఆర్ఎ్సఈ) దీన్ని స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించింది. ఈ సంస్థ నిర్మిస్తున్న 8యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్స్ (ఏఎ్సడబ్ల్యూ ఎస్డబ్ల్యూసీఎస్) శ్రేణి నౌకల్లో ఇది రెండోది. దీనికంటే ముందు నిర్మించిన ఐఎన్ఎస్ ఆర్నాలా ఈ ఏడాది జూన్ 18న నేవీలోకి చేరింది. తాజాగా విధుల్లోకి చేరిన యుద్ధనౌకకు లక్ష దీవుల్లోని ‘ఆండ్రోత్’ అనే దీవి పేరు పెట్టారు. దీని పొడవు దాదాపు 77 మీటర్లు. దీనిలో అత్యాధునిక తేలికపాటి టోర్పిడోలు, జలాంతర్గామి విధ్వంసక రాకెట్లు ఉన్నాయి.




