News

మరాఠా పాలకుల కోటలకు యునెస్కో గుర్తింపు

241views

మరాఠా పాలకులు నిర్మించిన అసాధారణ కోట, సైనిక వ్యవస్థను సూచించే పలు కోటలను ‘మరాఠా మిలిటరీ లాండ్‌స్కేప్స్‌’ పేరుతో ప్రఖ్యాత యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో తాజాగా చేర్చారు. పారిస్‌లో జరుగుతున్న ప్రపంచ వారసత్వ కమిటీ (డబ్ల్యూహెచ్‌సీ) 47వ సదస్సులో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు యునెస్కో ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించింది. మహారాష్ట్రలోని సాల్హేర్‌ కోట, శివ్‌నేరీ కోట, లోహ్‌గఢ్, ఖండేరీ కోట, రాయగఢ్, రాజ్‌గఢ్, ప్రతాప్‌గఢ్, సువర్ణదుర్గ్, పన్హాలా కోట, విజయ్‌దుర్గ్, సింద్‌దుర్గ్, తమిళనాడులోని జింజీ కోట ఈ ‘మరాఠా మిలిటరీ లాండ్‌స్కేప్స్‌’లో భాగంగా ఉన్నాయి. ఈ 12 కోటల సమాహారంలో సల్హేర్‌ కోట, శివనేరి కోట, లోహ్‌గఢ్‌, ఖండేరి కోట రాజీగఢ్‌, రాజ్‌గఢ్‌, ప్రతాప్‌గఢ్‌, సువర్ణదుర్గ్‌, పన్హాలా కోట, విజయ్‌ దుర్గ్‌, సింధుదుర్గ్‌లు మహారాష్ట్రలో ఉండగా జింజీ కోట తమిళనాడులో ఉంది. కాగా, మరాఠీ మిలిటరీ ల్యాండ్‌స్కేప్‌లు 17-19 శతాబ్దాల మధ్య నిర్మించారు. విభిన్న భౌగోళిక, భౌతిక ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఈ భాగాలు మరాఠా పాలన వ్యూహాత్మక శక్తులను ప్రతిబింబిస్తాయని భారతీయ అధికారులు పేర్కొన్నారు.