News

బక్రీద్ రోజున, మధురలో ఆవును వధించి, రోడ్డు పక్కన అవశేషాలు

313views

ఉత్తరప్రదేశ్ లోని మధురలో బక్రీద్ రోజున గోవధ వెలుగులోకి వచ్చింది. రోడ్డు పక్కన వేలాడుతున్న ఆవు అవశేషాలు కనిపించాయి. దీనిపై హిందూ సంస్థల నిరసనల తర్వాత, పోలీసులు 50 మందికి పైగా వ్యక్తులపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. వీరిలో సాకిర్, సమీర్, సోహైల్, అన్వర్ వకీల్, ఇంతెజార్, అన్సార్, పింటు, అసిన్, ఓషో, స్టార్, ఫజల్, షారుఖ్, హనీ ఖురేషి, ఆరిఫ్, ధౌసి, బాబు, ఘోసి, సన్నీ, ఉస్మాన్, ఫిరోజ్, రషీద్, నజ్జు, చంద్, ఫరూఖ్, సోహైల్ మరియు ఇతర మతోన్మాద ముస్లింలు ఉన్నారు.

పోలీసులు నమోదు చేసిన కేసు ప్రకారం, జూన్ 7న బక్రీద్ సందర్భంగా రాత్రి 8 గంటలకు బర్సానా రోడ్డులోని ఈద్గా ముందు ఉన్న కసాయి దుకాణంలో ఆవులను వధించారు. మిగిలిన ఆవుల అవశేషాలను రోడ్డు పక్కన వేలాడదీశారని పోలిసులు తెలిపారు. గోవర్ధన వంటి మతపరమైన ప్రదేశాలలో ఆవులు సురక్షితంగా లేకపోతే, ఆవులు ఇంకా ఎక్కడ సురక్షితంగా ఉండవని హిందూ సంస్థ నిరసన వ్యక్తం చేస్తున్నాయి.