News

రాముణ్ని ఊహాజనిత పాత్రగా పేర్కొన్నందుకు రాహుల్‌పై యూపీ కోర్టులో ఫిర్యాదు

341views

శ్రీరాముణ్ని పౌరాణిక, ఊహాజనిత పాత్రగా రాహుల్‌గాంధీ అభివర్ణించారని ఆరోపిస్తూ ఒక న్యాయవాది స్థానిక కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. కాంగ్రెస్‌ నేతపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఫిర్యాదుదారు కోరారు. లోక్‌సభలో ప్రతిపక్షనేత, కాంగ్రెస్‌ నాయకుడు అయిన రాహుల్‌గాంధీ అమెరికాలో ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఫిర్యాదుదారు పేర్కొన్నారు. ఈ కేసులో అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీని కూడా కక్షిదారుగా చేర్చారు. కోర్టు ఈ కేసుపై ఈనెల 19న విచారణ జరపనుంది. అమెరికాలో బోస్టన్‌లోని బ్రౌన్‌ విశ్వవిద్యాలయంలో రాహుల్‌ గతనెల 21న ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఫిర్యాదు దాఖలు చేసిన న్యాయవాది హరిశంకర్‌ పాండే పేర్కొన్నారు.