News

ఆపరేషన్ సిందూర్ – దేశ ఆత్మగౌరవం ఇనుమడింపు : ఆర్.ఎస్.ఎస్.

72views

పహల్గామ్ వద్ద నిరాయుధ పర్యాటకులపై పిరికిపంద దాడి తర్వాత పాక్ ప్రాయోజిత ఉగ్రవాదులు మరియు వారికి మద్దతు ఇచ్చే జీవన వ్యవస్థపై తీసుకున్న “ఆపరేషన్ సిందూర్” నిర్ణయాత్మక చర్యకు కేంద్ర ప్రభుత్వ నాయకత్వాన్ని, మన సాయుధ దళాలను మేము అభినందిస్తున్నాము. హిందూ పర్యాటకులపై జరిగిన దారుణ హత్యాకాండలో బాధితులైన కుటుంబాలకు, యావత్ దేశానికి న్యాయం చేసే దిశగా తీసుకున్న ఈ చర్య దేశ ఆత్మగౌరవాన్ని మరియు నైతికతను ఇనుమడింపజేసింది.

పాకిస్తాన్‌లో ఉగ్రవాదులు, వారి మౌలిక స్థావరాలు, సహాయక వ్యవస్థలపై సైనిక చర్య తీసుకోవడం దేశభద్రతకు అవరసమని, అనివార్యమని మేము పూర్తిగా విశ్వసిస్తున్నాము. ఈ జాతీయ సంక్షోభ సమయంలో యావత్ దేశం ప్రభుత్వానికి, సాయుధ దళాలకు పూర్తి మద్దతుగా నిలుస్తోంది.

భారత సరిహద్దులోని ధర్మ క్షేత్రాలు, పౌర నివాస ప్రాంతాలపై పాకిస్తాన్ సైన్యం చేస్తున్న దాడులను మేము ఖండిస్తున్నాము. అలాగే, ఈ క్రూరమైన, అమానవీయ దాడులలో బాధితులపై కుటుంబాలకు హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాము.

ప్రస్తుత సంక్లిష్ట సమయంలో, ప్రభుత్వయంత్రాంగం ఇచ్చే సూచనలను పూర్తిగా పాటించాలని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ యావత్ దేశ పౌరులకు విజ్ఞప్తి చేస్తోంది. దీనితో పాటు, అంకితభావంతో కూడిన మన పౌర విధిని నిర్వర్తించే సమయంలో మనమందరం జాగరూకతతో ఉండాలి. సామాజిక ఐక్యతను, సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించే దేశ వ్యతిరేక శక్తుల కుట్రలను మనం ఏమాత్రం అనుమతించకూడదు.

పౌరులందరూ తమ దేశభక్తిని ప్రదర్శించాలని, అవసరమైన చోట సైన్యం, పౌర పరిపాలనా యంత్రాంగానికి ఏ విధమైన సహకారాన్నైనా అందించేందుకు సిద్ధంగా ఉండాలని, జాతీయ ఐక్యత, భద్రతను సంరక్షించుకునేందుకు అన్ని ప్రయత్నాలను బలోపేతం చేయాలని అభ్యరిస్తున్నాము.

పరమ పూజనీయ సర్‌సంఘచాలక్ డా.మోహన్ భాగవత్ గారు,
మాననీయ సర్‌కార్యవాహ శ్రీ దత్తాత్రేయ హోసబాలే గారు,
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్.