
నంద్యాల జిల్లా, సంఘమిత్ర -నిరంతర సేవా స్రవంతి ఆధ్వర్యంలో అడవి బిడ్డలను అక్కున చేర్చుకుని అవసరాలు తీరుస్తున్న సంఘమిత్ర సేవా సమితి దత్తత తీసుకున్న చెంచు గూండాలలో నలమల అడవుల్లో ఉన్న చెంచులకు దుస్తులు పంపిణి చేశారు. సంఘమిత్ర సేవా కార్యక్రమాలలో సంవత్సరంలో మూడు నాలుగు సార్లు ఇలా దుస్తులు పంపిణి చేయటం జరుగుతోంది.
నిరంతర వైద్య సహాయం అందించడంతో పాటు, అవసరానికనుగుణంగా, వర్షా కాలం దోమలు, చలినుండి వారిని వారు కాపాడుకోవటానికి దుప్పట్లు, దుస్తులు పంపిణీ చేసింది.
మనుషులను చూస్తూనే అభద్రతా భావంతో దూరంగా తొలగి పోయే చెంచులు సంఘమిత్ర సభ్యుల ప్రేమకు మురిసి వారి చేయి పట్టుకుని ఫోటోలు దిగుతున్నారు.
దత్తత గూడెమైన నాగలూటిలో జరిగిన కార్యక్రమంలో సంఘమిత్ర అధ్యక్షుడు శ్రీ చిలుకూరు శ్రీనివాస్, కార్యదర్శి శ్రీ కర్నాటి నాగ సుబ్బారెడ్డి, కార్యవర్గ సభ్యుడు శ్రీ ఉసిరికాయల వెంకట రమణయ్య గౌడు, సేవా ప్రముఖ్ శ్రీ శ్రీనివాస్, శ్రీ బాలరాజు, పాఠశాల ఉపాధ్యాయుడు శ్రీ శివాజీ తదితరులు పాల్గొన్నారు.