హైందవ శంఖారావం సభలో ఎస్సీ నాయకులు గరికముక్కు సుబ్బయ్య ప్రసంగం:
ఈ దేశంలో ఎస్సీ కులాల వారు కూడా హిందువులే. కులం మన వ్యక్తిగతం. ధర్మం మన స్వయం, మనం ధర్మ రక్షకులం.
సమరసతా సేవా ఫౌండేషన్ ద్వారా ఎందరో ఎస్సీ ఎస్టీలకు అర్చక శిక్షణ ఇప్పించి ఆలయాల్లో నియమింపజేసాం.
రాజ్యాంగం ప్రకారం ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చారు. అస్పృశ్యత అంటరానితనానికి గురైన కొన్ని కులాలకు, హిందూ ధర్మాన్ని ఆచరించే సనాతన ధర్మ ఆచరణ చేసేవారికి మాత్రమే రిజర్వేషన్లు ఇచ్చారు.
హిందూ ధర్మాన్ని ఆచరించే అంటరానితనాన్ని అనుభవిస్తున్నవారికే రిజర్వేషన్లు అని రాజ్యాంగంలో స్పష్టం చేసారు.
అన్యమతస్తులకు రిజర్వేషన్లు లేవు అని స్పష్టంగా రాజ్యాంగంలో చెప్పారు. ఇవాళ అన్యమతాల్లోకి మారిపోయి రిజర్వేషన్లు వాడుకుంటున్నారు. అది రాజ్యాంగ వ్యతిరేకం.
రిజర్వేషన్ సర్టిఫికెట్లు ఎవరికి ఇస్తున్నారు. ప్రభుత్వాధికారులు, రాజకీయ నేతలూ గమనించాలి. మతం మారిన వారికే రిజర్వేషన్లు ఇస్తున్నారు.. అది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం.
మతం మారిన వారికి రిజర్వేషన్లు ఇవ్వకూడదు.
అన్ని కులాల్లో ఉన్నవారూ హిందువులే. మతం మారినవారందరూ వెనక్కి రావాలి.
రాజ్యాంగ సభలో చర్చ జరిగే సందర్భంలో క్రైస్తవులు ఒకటి చెప్పారు… మా మతంలో కులం లేదు, అంటరానితనం లేదు.. అని చెప్పారు. మరి ఇప్పుడు ఎందుకు పాటిస్తున్నారు?
హిందూ ధర్మంలో ఉండండి… లేకుండా మరో మతంలోకి వెడితే రిజర్వేషన్లు వాడుకునే హక్కు మీకు లేదు. అది అంబేద్కర్ స్పష్టంగా చెప్పారు.
ఎండోమెంట్ గుడుల్లో హిందువులైన ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ప్రాధాన్యం కల్పించండి.
అన్యమతస్తులకు అవకాశం ఇవ్వవద్దు. అన్ని గుడుల్లో అర్చకులుగా ఎస్సీ ఎస్టీలకు ప్రాతినిధ్యం కల్పించాలి.
మేమంతా హిందువులు, సనాతన ధర్మవాదులం, భారత్ మాతా కీ జై.
జమ్మూ–కాశ్మీర్ లోని పూంఛ్ లో గత 21 సంవత్సరాలుగా బజరంగ్ దళ్ నిరంతరంగా నిర్వహిస్తున్న “సాహసీ యాత్ర” ఈ ఏడాది కూడా ఆధ్యాత్మిక ఉత్సాహంతో ప్రారంభం కానుంది....
సనాతన ధర్మం అనేది కేవలం ఒక మతపరమైన వ్యవస్థ మాత్రమే కాదు; అది మానవ జీవన విధానాన్ని, సమాజ నిర్మాణాన్ని, పరస్పర గౌరవాన్ని, ధార్మిక విలువలను సమన్వయపరిచే...
గోసంరక్షణను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ద్వారకా జ్యోతిష్య పీఠాధిపతులు శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద్ సరస్వతి ఒక కొత్త డిజిటల్ వేదికను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ‘గో-ఓఎల్ఎక్స్’ అనే పేరుతో...
బహిరంగ ప్రదేశాలు, రోడ్లపై నమాజ్ చేయడాన్ని నిషేధిస్తూ ఉత్తరాఖండ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ శనివారం పూర్తి మద్దతు ప్రకటించారు. మతపరమైన పండుగల...