హైందవ శంఖారావం సభలో ఎస్సీ నాయకులు గరికముక్కు సుబ్బయ్య ప్రసంగం:
ఈ దేశంలో ఎస్సీ కులాల వారు కూడా హిందువులే. కులం మన వ్యక్తిగతం. ధర్మం మన స్వయం, మనం ధర్మ రక్షకులం.
సమరసతా సేవా ఫౌండేషన్ ద్వారా ఎందరో ఎస్సీ ఎస్టీలకు అర్చక శిక్షణ ఇప్పించి ఆలయాల్లో నియమింపజేసాం.
రాజ్యాంగం ప్రకారం ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చారు. అస్పృశ్యత అంటరానితనానికి గురైన కొన్ని కులాలకు, హిందూ ధర్మాన్ని ఆచరించే సనాతన ధర్మ ఆచరణ చేసేవారికి మాత్రమే రిజర్వేషన్లు ఇచ్చారు.
హిందూ ధర్మాన్ని ఆచరించే అంటరానితనాన్ని అనుభవిస్తున్నవారికే రిజర్వేషన్లు అని రాజ్యాంగంలో స్పష్టం చేసారు.
అన్యమతస్తులకు రిజర్వేషన్లు లేవు అని స్పష్టంగా రాజ్యాంగంలో చెప్పారు. ఇవాళ అన్యమతాల్లోకి మారిపోయి రిజర్వేషన్లు వాడుకుంటున్నారు. అది రాజ్యాంగ వ్యతిరేకం.
రిజర్వేషన్ సర్టిఫికెట్లు ఎవరికి ఇస్తున్నారు. ప్రభుత్వాధికారులు, రాజకీయ నేతలూ గమనించాలి. మతం మారిన వారికే రిజర్వేషన్లు ఇస్తున్నారు.. అది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం.
మతం మారిన వారికి రిజర్వేషన్లు ఇవ్వకూడదు.
అన్ని కులాల్లో ఉన్నవారూ హిందువులే. మతం మారినవారందరూ వెనక్కి రావాలి.
రాజ్యాంగ సభలో చర్చ జరిగే సందర్భంలో క్రైస్తవులు ఒకటి చెప్పారు… మా మతంలో కులం లేదు, అంటరానితనం లేదు.. అని చెప్పారు. మరి ఇప్పుడు ఎందుకు పాటిస్తున్నారు?
హిందూ ధర్మంలో ఉండండి… లేకుండా మరో మతంలోకి వెడితే రిజర్వేషన్లు వాడుకునే హక్కు మీకు లేదు. అది అంబేద్కర్ స్పష్టంగా చెప్పారు.
ఎండోమెంట్ గుడుల్లో హిందువులైన ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ప్రాధాన్యం కల్పించండి.
అన్యమతస్తులకు అవకాశం ఇవ్వవద్దు. అన్ని గుడుల్లో అర్చకులుగా ఎస్సీ ఎస్టీలకు ప్రాతినిధ్యం కల్పించాలి.
మేమంతా హిందువులు, సనాతన ధర్మవాదులం, భారత్ మాతా కీ జై.
పాకిస్థాన్లో భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఉగ్రవాదుల ఏరివేత పరంపర కొనసాగుతోంది. గుర్తు తెలియని వ్యక్తులు జరుపుతున్న దాడుల్లో కీలక ఉగ్రవాదులు ఒకరి తర్వాత ఒకరు హతమవుతున్నారు....
ప్రస్తుత పరిస్థితుల్లో భద్రత అనేది కేవలం ప్రభుత్వాల పనే కాదని ,అది ప్రతి పౌరుడిపైనా వుందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సూచించారు. భారత్ ప్రస్తుతం...
జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU) కన్వెన్షన్ సెంటర్లో ఏప్రిల్ 15, 2026న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ఆధ్వర్యంలో 'యువ కుంభ్' కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. వామపక్ష...
అచ్చెరువొందె నిర్మాణాలు, అపురూప కట్టడాలు, ఔరా! అనిపించే చారిత్రక, ఆథ్యాత్మిక స్థలాలు! ఇలాంటివి వారసత్వ చిహ్నాలు. తరతరాలుగా వస్తున్న చెక్కుచెదరని ఈ సంపదను భవిష్యత్ తరాలకు అందించడాన్నే...
విశ్వహిందూ పరిషత్ (VHP), బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఈరోజు దిల్సుఖ్నగర్లో లవ్ జిహాద్కు వ్యతిరేకంగా భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీహెచ్పీ జాతీయ అధికార...