News

హైందవ శంఖారావం సభలో ఎస్సీ నాయకులు గరికముక్కు సుబ్బయ్య ప్రసంగం

403views

హైందవ శంఖారావం సభలో ఎస్సీ నాయకులు గరికముక్కు సుబ్బయ్య ప్రసంగం:

  • ఈ దేశంలో ఎస్సీ కులాల వారు కూడా హిందువులే. కులం మన వ్యక్తిగతం. ధర్మం మన స్వయం, మనం ధర్మ రక్షకులం.
  • సమరసతా సేవా ఫౌండేషన్ ద్వారా ఎందరో ఎస్సీ ఎస్టీలకు అర్చక శిక్షణ ఇప్పించి ఆలయాల్లో నియమింపజేసాం.
  • రాజ్యాంగం ప్రకారం ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చారు. అస్పృశ్యత అంటరానితనానికి గురైన కొన్ని కులాలకు, హిందూ ధర్మాన్ని ఆచరించే సనాతన ధర్మ ఆచరణ చేసేవారికి మాత్రమే రిజర్వేషన్లు ఇచ్చారు.
  • హిందూ ధర్మాన్ని ఆచరించే అంటరానితనాన్ని అనుభవిస్తున్నవారికే రిజర్వేషన్లు అని రాజ్యాంగంలో స్పష్టం చేసారు.
  • అన్యమతస్తులకు రిజర్వేషన్లు లేవు అని స్పష్టంగా రాజ్యాంగంలో చెప్పారు. ఇవాళ అన్యమతాల్లోకి మారిపోయి రిజర్వేషన్లు వాడుకుంటున్నారు. అది రాజ్యాంగ వ్యతిరేకం.
  • రిజర్వేషన్ సర్టిఫికెట్లు ఎవరికి ఇస్తున్నారు. ప్రభుత్వాధికారులు, రాజకీయ నేతలూ గమనించాలి. మతం మారిన వారికే రిజర్వేషన్లు ఇస్తున్నారు.. అది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం.
  • మతం మారిన వారికి రిజర్వేషన్లు ఇవ్వకూడదు.
    అన్ని కులాల్లో ఉన్నవారూ హిందువులే. మతం మారినవారందరూ వెనక్కి రావాలి.
  • రాజ్యాంగ సభలో చర్చ జరిగే సందర్భంలో క్రైస్తవులు ఒకటి చెప్పారు… మా మతంలో కులం లేదు, అంటరానితనం లేదు.. అని చెప్పారు. మరి ఇప్పుడు ఎందుకు పాటిస్తున్నారు?
  • హిందూ ధర్మంలో ఉండండి… లేకుండా మరో మతంలోకి వెడితే రిజర్వేషన్లు వాడుకునే హక్కు మీకు లేదు. అది అంబేద్కర్ స్పష్టంగా చెప్పారు.
  • ఎండోమెంట్ గుడుల్లో హిందువులైన ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ప్రాధాన్యం కల్పించండి.
  • అన్యమతస్తులకు అవకాశం ఇవ్వవద్దు. అన్ని గుడుల్లో అర్చకులుగా ఎస్సీ ఎస్టీలకు ప్రాతినిధ్యం కల్పించాలి.
  • మేమంతా హిందువులు, సనాతన ధర్మవాదులం, భారత్ మాతా కీ జై.