News

హిందూ సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

205views

భారతదేశ సనాతన సాంప్రదాయ హిందూ సంస్కృతికి, సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రాలయం మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు అన్నారు. బెంగళూరులోని పూర్ణప్రజ్ఞ విద్యాపీఠం మహాస భలో మంత్రాలయం పీఠాధిపతితో పాటు విశ్వప్రసన్నతీర్థులు, విశ్వేశ్వర తీర్థులు ముఖ్యఅతిథులుగా పాల్గొని మాట్లాడారు. సంస్కృత విద్య ఖం డాంతర వ్యాప్తి చెందాలన్నారు. ప్రతి విద్యార్థి సంస్కృతంలో పీహెచడీ సాధించేందుకు విశేష కృషి చేస్తూ హిందూ సంస్కృతికి పాటు పడాల న్నారు. కంప్యూటర్‌ యుగంలో సంస్కృత విద్య వ్యాప్తికి కృషి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సమావేశంలో పండిత కేసరి విద్వాన రాజా ఎస్‌ గిరిరాజాచార్‌, ద్వారపాలక అనంతస్వామి, ప్రకాషాచార్‌, పవన తదితరులు పాల్గొన్నారు.