News

త్రిలింగ దర్శనం కోసం ప్రత్యేక బస్సులు

336views

కార్తీక మాసంలో త్రిలింగ దర్శనం పేరుతో తాడిపత్రి బుగ్గరామలింగేశ్వరస్వామి, యాగంటి, మహానంది క్షేత్రాల సందర్శనకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు పుట్టపర్తి ఆర్టీసీ ఆర్‌ఎం మధుసూదన్‌ తెలిపారు. బస్సుల నిర్వహణపై ట్రాఫిక్‌, గ్యారేజ్‌, ఆర్‌ఎం కార్యాలయం సిబ్బందితో ఆయన సమీక్షించారు. నవంబర్‌ 2 నుంచి డిసెంబర్‌ 1వ తేదీ వరకూ ప్రతి సోమవారం జిల్లాలోని అన్ని డిపోల నుంచి ఉదయం 5 గంటలకు బస్సులు బయలుదేరి, తిరిగి సాయంత్రం ఆయా డిపోలకు చేరుతాయన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా సర్వీసులు పెంచుతామన్నారు. 40 మంది భక్తులు ఒక గ్రామం నుంచి వెళ్లాలనుకుంటే ఆ గ్రామం నుంచే బస్సు ఏర్పాటు చేస్తామన్నారు. ఆన్‌లైన్‌ ద్వారా రిజర్వేషన్‌ సదుపాయంతో పాటు సమీప బస్‌స్టేషన్‌, ఏటీబీ ఏజెంట్ల వద్ద కూడా రిజర్వేషన్‌ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.