News

మహిళలు నవ భారత్ కోసం ముందుకు రావాలి

235views

“స్త్రీలు తమలోని అసమాన్యమైన శక్తిని గుర్తెరిగి నవ భారత్ నిర్మాణం దిశగా ముందుకు రావాలి’’, అని ప్రఖ్యాత శాస్త్రీయ నృత్యకారిణి పద్మవిభూషణ్ సోనాల్ మాన్‌సింగ్ పిలుపునిచ్చారు. రాష్ట్ర సేవికా సమితి, నాగాపూర్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన విజయదశమి కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర సేవికా సమితి ప్రధాన సంచాలకులు వి. శాంతకుమారి మాట్లాడుతూ మన దేశాన్ని అస్థిరపరిచేందుకు, యువతను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్న శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. గుడ్డి అనుకరణకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. మహిళల పట్ల అసభ్య ప్రవర్తన, అమానవీయ నేరాల వంటి ఘటనలు పెచ్చు మీరుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీటికి వ్యతిరేకంగా వ్యక్తిగత, సామాజిక స్థాయిలో కృషి చేయవలసిన అవసరం ఉందన్నారు. కఠినమైన చట్టాలు, త్వరితగతిన నిర్ణయాలు తీసుకునే ప్రక్రియతో పాటు, సామాజిక అవగాహన సైతం అవసరమని ఈ సందర్భంగా వందనీయ శాంతక్క ప్రస్తావించారు.

సైద్ధాంతిక గందరగోళం కారణంగా, ప్రజలు “హైందవ: సోద్ర: సర్వే” (హిందువులందరూ సోదరులు) అనే ప్రాథమిక తత్వాన్ని మర్చిపోయి కులం, వర్గం, సంఘం, మతం గొలుసులలో చిక్కుకుపోయి తమ అపారమైన సాంస్కృతిక సారాన్ని బలహీనపరుస్తున్నారని వివరించారు. ఈ కారణం దృష్ట్యా ప్రధానమైన హిందూ ఆలోచనను కార్యరూపంలోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ప్రాథమిక తత్వాన్ని మరచిపోయి, “హైందవ: సోద్ర: సర్వే” అని చెప్పేవాడు నేడు కులం, వర్గం, వర్గాల, మతం బానిసత్వంలో చిక్కుకుని, తన గొప్ప రూపాన్ని తెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని తెలిపుతూ అందుకే హిందూ ఆలోచనను ఆచరణలోకి తీసుకు రావాలని శాంతక్క చెప్పారు.

ఈ కార్యక్రమంలో భయ్యాజీ జోషి, ఆర్.ఎస్.ఎస్.కి చెందిన అఖిల భారతీయ కార్యకారిణి సదస్సు, సీతా గాయత్రి అన్నదానం, రాష్ట్రీయ సేవిక సమితి ప్రముఖ్ కార్యవాహక మనీషా అథవాలే, విదర్భ ప్రాంత కార్యవాహక, కరుణా సాఠే, నాగ్‌పూర్ డివిజన్ కార్యవాహక, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.