News

దేశ వ్యాప్తంగా ఎన్నికల ఫలితాల లెక్కింపు

65views

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన భారత దేశంలో 543 మంది సభ్యులు గల లోక్ సభకు …., ఆంధ్ర ప్రదేశ్ తో పాటు వివిధ రాష్ట్రాల శాసన సభలకు జరిగిన ఎన్నికలకు సంబంధిన ఓట్ల లెక్కింపు మరి కొద్ది సేపటిలో ప్రారంభం కానున్నది. ఓట్ల లెక్కింపు కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు వీలుగా కేంద్ర ఎన్నికల సంఘం దేశ వ్యాప్తంగా విస్తృత స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేసింది. ఈ రోజు ఉదయం 8 గంటల నుండి లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతోంది. రాజకీయ పార్టీల మధ్య ఎంతో హోరా హోరీగా సాగిన ఈ ఎన్నికల ఫలితాలు ఎప్పటికప్పుడు పొందుపరచే ఓటర్ హెల్ప్ లైన్ యాప్ లో అందుబాటులో ఉంటాయని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ ప్లే స్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకుని ఫలితాలు తెలుసుకోవచ్చు.